Sunday, November 16, 2025
Homeఆంధ్రప్రదేశ్AP Assembly: ఏపీ అసెంబ్లీ సమావేశాలకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల

AP Assembly: ఏపీ అసెంబ్లీ సమావేశాలకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల

ఫిబ్రవరి 24 నుంచి ఏపీ అసెంబ్లీ(AP Assembly) సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈమేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. తొలిరోజు ఉదయం 10 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. ఈ నెల 27న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో చర్చ చేపట్టనున్నారు. ఇక ఫిబ్రవరి 28న 2025-26 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి.

- Advertisement -

15 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరపాలని ప్రభుత్వం యోచిస్తోంది. బీఏసీ సమావేశం తర్వాత సభ ఎన్ని రోజులు జరిగే దానిపై చర్చించనున్నారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సభకు పూర్తి స్థాయి సబ్జెక్టుతో హాజరుకావాలని మంత్రులకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad