Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Gonegandla: విలేఖరి మునిస్వామికి మాచాని సోమనాథ్ పరామర్శ

Gonegandla: విలేఖరి మునిస్వామికి మాచాని సోమనాథ్ పరామర్శ

ఐసియులో చికిత్స పొందుతున్న జర్నలిస్ట్

మండల కేంద్రమైన గొనేగండ్లకు చెందిన విలేఖరి మునిస్వామి గత నాలుగు రోజులు క్రితం బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయ్యి కోమాలోకి పోయి కర్నూలు నగరంలోనీ ఆర్కా హాస్పిటల్ నందు ఐసియులో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మిగనూరు నియోజకవర్గం టిడిపి నాయకులు డాక్టర్ మాచాని సోమనాథ్ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు.

- Advertisement -


మునిస్వామి యొక్క ఆరోగ్యం పరిస్థితి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. పరామర్శించిన వారిలో మాజీ యం.పి.పి కె.వి.కృష్ణా రెడ్డి, పెద్దనేలటూరు పరమేశ్వర రెడ్డి, బైలుప్పల లక్ష్మీ నారాయణ, విశాలాంధ్ర నాగరాజు, అక్బర్ వలి, బడేసాబ్ నాయుడు, జనసేన గానిగ భాష, ఆర్మీ సుధాకర్ లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News