Wednesday, September 18, 2024
Homeఆంధ్రప్రదేశ్Guduru: టిడిపితోనే రాష్ట్ర భవిష్యత్తు

Guduru: టిడిపితోనే రాష్ట్ర భవిష్యత్తు

జిల్లాలో విస్తృతంగా భువనేశ్వరి పర్యటన

రాష్ట్రం బాగుపడాలన్నా, భవిష్యత్తు తరాలకు మంచి జరగాలన్నా టిడిపి అధికారంలోకి రావాలని నారా భువనేశ్వర్ అన్నారు. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా పట్టణంలో పర్యటించిన నారా భువనేశ్వరి మృతి చెందిన టిడిపి నేతల కుటుంబాలను పరామర్శించి చెక్కులను అందజేశారు.

- Advertisement -

బోయ గౌరన్న, షేక్షావలి కుటుంబ సభ్యులను ఓదార్చి టిడిపి ఎల్లవేళలా అండగా ఉంటుందని వారికి ధైర్యం నింపారు. ఎలాంటి తప్పు చేయని చంద్రబాబునాయుడును అక్రమ అరెస్టు చేసి భయాందోళనకు గురి చేశారని మండిపడ్డారు. మరల జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే రాష్ట్రం అంధకారంలోకి వెళ్తుందని, కాబట్టి ప్రజలు నారా చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిగా చేసి రాష్ట్ర భవిష్యత్తును కాపాడాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బిటి నాయుడు, పంచు మూర్తి అనురాధ, సీనియర్ టిడిపి నేత డి విశ్వవర్ధన్ రెడ్డి, టిడిపి అభ్యర్థి బొగ్గుల దస్తగిరి, పట్టణ కన్వీనర్ గజేంద్ర గోపాల్ నాయుడు, నేతలు రామాంజనేయులు, డి సుందరాజు, సులేమాన్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News