Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Guduru: ప్రజా ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

Guduru: ప్రజా ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

రాష్ట్రంలో ప్రజా ఆరోగ్యంపై వైసీపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని వైసిపి వైద్య విభాగం రాష్ట్ర కార్యదర్శి ఆదిమూలపు సతీష్ అన్నారు. కోడుమూరు నియోజవర్గం కర్నూలు మండల పంచలింగాల గ్రామంలో వైద్య విభాగం రాష్ట్ర కార్యదర్శి ఆదిమూలపు సతీష్ స్థానిక వైఎస్సార్ హెల్త్ క్లినిక్, అంగన్వాడి కేంద్రాలను సందర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చి ప్రజా ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. ఇందులో భాగంగా వైఎస్ఆర్ హెల్త్ క్లినికల్ ద్వారా గ్రామస్థాయిలో వైద్యులతో పాటు ఉచిత మందుల పంపిణీ కూడా నిరంతరం కొనసాగుతుందని గుర్తు చేశారు. అంగన్వాడి కేంద్రాలలో అందించే పౌష్టికాహారాన్ని చిన్నారులతో పాటు బాలింతలు, గర్భిణీ స్త్రీలు సద్వినియోగ చేసుకోవాలని ఆదుకోవాలని సురేష్ మహిళలకు సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఉద్యోగులు, వైసీపీ నేతలు కార్యకర్తలు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News