Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Gummanuru Jayaram: 'గడప గడప'లో మంత్రికి ఘన స్వాగతం

Gummanuru Jayaram: ‘గడప గడప’లో మంత్రికి ఘన స్వాగతం

జగన్మోహన్ రెడ్డిని మళ్లీ సీఎంని చేస్తామని గ్రామస్తుల భరోసా

‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం హొళగుంద మండలం వందవాగిలి సచివాలయం పరిధిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉపాధి కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, ఆలూరు తాలూకా ఇంచార్జ్ గుమ్మనూరు నారాయణస్వామి, దేవరగట్టు ఆలయ కమిటీ చైర్మన్ కుమ్మనూరు శ్రీనివాసులు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని సింగిల్ విండో సొసైటీ చైర్మన్ మల్లికార్జున, మేల్గిరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం సచివాలయం పరిధిలోకి వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. సీసీ రోడ్డు, డ్రైనేజ్ నిర్మించాలని కోరారు. దానికోసం సచివాలయానికి వచ్చిన 20 లక్షలు కేటాయించాలని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులకు, అధికారులకు ప్రతి ఇంటివద్దా ప్రజలు ఆనందంతో స్వాగతం పలికారు. అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరింస్తూ తమ దృష్టికి వచ్చిన సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. తమ సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తామని గ్రామస్తులు భరోసా ఇచ్చారు.

- Advertisement -

ఈకార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బావ కొగిలతోట శేషప్ప,మండల కన్వీనర్ షఫీ ఉల్లా,వైసీపీ సీనియర్ నాయకులు, వైసిపి యువ నాయకులు,ఎంపీపీ తనయుడు ఈసా,సర్పంచులు, ఎంపీటీసీ,సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, ఆలూరు సిఐ వెంకటేశ్వర్లు,హొళగుంద ఎస్సై శ్రీనివాసులు,హాలహర్వి ఎస్సై నాగేంద్ర,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News