Thursday, July 4, 2024
Homeఆంధ్రప్రదేశ్Heat wave: రేపు వడగాల్పులు వీచే ప్రాంతాలివే

Heat wave: రేపు వడగాల్పులు వీచే ప్రాంతాలివే

డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ORS, మజ్జిగ, నిమ్మకాయ నీరు, కొబ్బరి నీరు తాగాలి

రేపు అనకాపల్లి జిల్లా నాతవరం, కాకినాడ జిల్లా కోటనందూరు, రౌతులపూడి మండలాల్లో తీవ్రవడగాల్పులు, 229 మండలాల్లో వడగాల్పులు, ఎల్లుండి 123 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 202 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపనున్నట్లు తెలిపారు.

- Advertisement -

బుధవారం ఏలూరు జిల్లా కామవరపుకోటలో 45°C, బాపట్ల జిల్లా కొప్పెరపాడులో 44.6°C,
ఏన్టీఆర్ జిల్లా చిలకల్లు, పెనుగ్రంచిపోలులో 44.3°C, ప్రకాశం జిల్లా కురిచేడు, అల్లూరి జిల్లా కొండైగూడెం, పల్నాడు జిల్లా జంగమేశ్వరంలో 44.2°Cల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు చెప్పారు. అలాగే 5 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 87 మండలాల్లో వడగాల్పులు వీచినట్లు వెల్లడించారు.

☀ జూన్ 8 గురువారం

• శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 44°C – 47°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

• విశాఖపట్నం, అనకాపల్లి, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42°C – 44°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

• అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40°C – 41°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రయాణాల్లో ఉన్నవారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజలు వీలైనంతవరకు ఇంట్లోనే ఉండాలని, డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ORS, మజ్జిగ, నిమ్మకాయ నీరు, కొబ్బరినీరు మొదలైనవి త్రాగాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి డా.బి.ఆర్ అంబేద్కర్ సూచించారు. మరోవైపు వేసవిలో అక్కడక్కడ ఈదురగాలులతో కురిసే అకాల వర్షాలతో పాటుగా పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే కూలీలు, పుశు-గొర్రె కాపరులు చెట్ల క్రింద ఉండరాదన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News