Tuesday, July 2, 2024
Homeఆంధ్రప్రదేశ్Heat wave: వడగాల్పులు తీవ్రత కొనసాగుతుంది

Heat wave: వడగాల్పులు తీవ్రత కొనసాగుతుంది

రేపు 268 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 235 మండలాల్లో వడగాల్పులు

రాష్ట్రంలో వడగాల్పులు తీవ్రత కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి డా.బిఆర్ అంబేద్కర్ తెలిపారు. రేపు 268 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 235 మండలాల్లో వడగాల్పులు, ఎల్లుండి 235 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 219 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు. సోమవారం తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్, శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

- Advertisement -

గురువారం ఏలూరు జిల్లా పంగిడిగూడెంలో 44.5°C, ప్రకాశం జిల్లా కురిచేడులో 44.2°C, తూర్పుగోదావరి జిల్లా చిట్యాల, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో 44.1°C, తిరుపతి జిల్లా సత్యవేడులో 44°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. అలాగే 210 మండలాల్లో తీవ్రవడగాల్పులు,220 మండలాల్లో వడగాల్పులు వీచాయన్నారు.

ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రయాణాల్లో ఉన్నవారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మరోవైపుఅక్కడక్కడ ఈదురగాలులతో కురిసే వర్షాలతో పాటుగా పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే కూలీలు, పుశు-గొర్రె కాపరులు చెట్ల క్రింద ఉండరాదన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News