Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్IIT Student : ఇడుపులపాయలో ట్రిపుల్ ఐటీ విద్యార్థి ఆత్మహత్య

IIT Student : ఇడుపులపాయలో ట్రిపుల్ ఐటీ విద్యార్థి ఆత్మహత్య

వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయకు చెందిన ట్రిపుల్ ఐటీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతపురం జిల్లా ఉరవకొండకు చెందిన ఈశ్వర సాయి ట్రిపుల్ ఐటీలో పీయూసీ-2 చదువుతున్నాడు. కుటుంబ సమస్యలతో మనస్తాపం చెందిన అతను.. హాస్టల్‌ గదిలో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. గది తలుపులు తెరవకపోవడంతో ఇతర విద్యార్థులు అధికారులకు సమాచారం అందించారు. అధికారులు గది తలుపులు తీసి చూడగా.. ఈశ్వర్‌ సాయి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది.

- Advertisement -

అధికారులు పోలీసులకు సమాచారమివ్వగా.. హాస్టల్ కు చేరుకున్న పోలీసులు ఈశ్వర సాయి మృతదేహాన్ని కిందికి దించారు. అతని వద్ద నుండి సూసైడ్‌ నోట్‌ ను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రుల కమ్యూనికేషన్ లేకపోవడమే తన మరణానికి కారణమని లేఖలో పేర్కొన్నాడు. ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ సంధ్యారాణి విద్యార్థి ఈశ్వరసాయి తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News