Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్IMD: ద్రోణితో వర్షాలు

IMD: ద్రోణితో వర్షాలు

ఐఎండి అంచనాల ప్రకారం శనివారం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం, నాతవరం కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ఈరోజు 10 మండలాల్లో వడగాల్పులు వీచాయి. విదర్భ నుండి తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో స్వల్పంగా ఎండ తీవ్రత తగ్గనుంది. రేపు అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. ఎల్లుండి గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలంలో పని చేసే రైతులు, కూలీలు, పశు, గొర్రె కాపరులు జాగ్రత్తగా ఉండాలి. చెట్ల క్రింద ఉండరాదు.

- Advertisement -

-డా.బి.ఆర్ అంబేద్కర్, మేనేజింగ్ డైరెక్టర్, విపత్తుల నిర్వహణ సంస్థ.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News