Thursday, July 4, 2024
Homeఆంధ్రప్రదేశ్Allagadda: భూమా అఖిల సమక్షంలో కొనసాగుతున్న టీడీపీలోకి చేరికలు

Allagadda: భూమా అఖిల సమక్షంలో కొనసాగుతున్న టీడీపీలోకి చేరికలు

ఊపందుకున్న చేరికలు

దొర్నిపాడు మండలంలోని రామచంద్రపురం గ్రామంలో వైసీపీ నుండి భారీ ఎత్తున టిడిపిలోకి చేరికలు జరిగాయి. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సమక్షంలో స్థానిక వైసిపి నాయకులు టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్రంలో రాక్షస పరిపాలన కొనసాగుతున్నదని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ విమర్శించారు. దొర్నిపాడు మండలం రామచంద్రాపురం గ్రామంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లినా తెలుగుదేశం పార్టీ ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారని, వైసిపి పాలనలో విసిగి వేసారి పోయి స్వచ్ఛందంగా టిడిపిలో చేరుతున్నారని తెలిపారు. రామచంద్రపురం గ్రామానికి చెందిన వైసిపి నేతలు అయిన ఉమాదేవి, వెంకట కృష్ణయ్య, డాక్టర్ వెంకట సుబ్బ నాయుడు, మరో 50 కుటుంబాలు మాజీ మంత్రిభూమా అఖిలప్రియ సమక్షంలో టిడిపిలో చేరారు.

- Advertisement -

సిరివెళ్లలో సేమ్ సీన్..

సిరివెళ్ల మండలం గోవింద పల్లెలో వైసీపీ నుండి టిడిపిలోకి 50 కుటుంబాలు చేరాయి. సిరివెళ్ల మండలం గోవిందపల్లి గ్రామానికి చెందిన ఉమ్మడి తిప్పారెడ్డి ఉమ్మడి కృష్ణారెడ్డి కొల్లి రాజగోపాల్ రెడ్డి కొల్లి రామకృష్ణారెడ్డి, కొల్లి లక్ష్మి బోయ నాగయ్య, చాకలి హుస్సేన్ చాకలి చందు వారి అనుచర వర్గం 50 కుటుంబాలు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సమక్షంలో టిడిపిలో చేరారు. వారందరికీ టిడిపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టిడిపి యువనేత భార్గవరామ్ నాగిరెడ్డి పల్లె శేఖర్ రెడ్డి, ఆర్ల నాగ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News