Tuesday, July 2, 2024
Homeఆంధ్రప్రదేశ్Kalluru: టీడీపీలోకి కాటసాని ముఖ్య అనుచరులు

Kalluru: టీడీపీలోకి కాటసాని ముఖ్య అనుచరులు

వైసిపి పార్టీని వీడి 30 కుటుంబాలు

ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ముఖ్య అనుచరులు వైసీపీని వీడి టీడీపీలో చేరారు.
పాణ్యం నియోకవర్గం కల్లూరు మండలం దొడ్డిపాడు గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు సయ్యద్ హుస్సేన్, హుస్మన్ బాషాతో పాటు, 30 కుటుంబాలు కల్లూరు మండలం నాయకులు పుసులూరు ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పాణ్యం మాజీ ఎమ్మెల్యే పాణ్యం టీడీపీ అభ్యర్థి గౌరు చరిత రెడ్డి సమక్షంలో టీడీపీ చేరారు. వీరందరినీ చరిత తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి, ఆహ్వానించి వారికి స్వాగతం పలికారు.
పార్టీలో చేరినవారు యస్ నజీర్ బాషా, జిలాన్ బాషా, నూర్ బాషా, పి సిలార్ బాషా, యస్ ఖాసిం, బందే నవాజ్, పి మిన్నల్ల, పి నబీ రసూల్, ఆటో శెక్షా, యస్ నబి రసుల్, దస్తగిరి, మిన్నల్ల, యస్ మసూం వలి ఉన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పెరుగు పురుషోత్తం రెడ్డి , తెలుగు యువత రాష్ట ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ యాదవ్ , పాణ్యo వాణిజ్య విభాగం అధ్యక్షులు బ్రాహ్మణపల్లి నాగిరెడ్డి , పెద్దటేకూరు సాయి తరుణ్ రెడ్డి, దొడ్డి పాడు గ్రామం నాయకులు మహబూబ్ బాషా, ఖాజా హుస్సేన్, సయ్యద్ ఖాసిం తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News