Wednesday, July 3, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandyala: వైసీపీని వీడి టిడిపిలోకి యువత

Nandyala: వైసీపీని వీడి టిడిపిలోకి యువత

క్రాంతి నగర్లో టీడీపీ హవా

నంద్యాల క్రాంతి నగర్ కు చెందిన యువత నంద్యాల టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్, నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సిపి పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి భారీగా చేరడం జరిగింది.ఈ సందర్భంగా క్రాంతి నగర్ కు చెందిన కేఎల్ దీపక్ రెడ్డి , బారెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో క్రాంతి నగర్ నుండి 200 కుటుంబాలు వైఎస్ఆర్సిపి వీడి టిడిపిలో చేరడం చాలా శుభపరిణామమని ఫరూక్ , ఫిరోజ్ అన్నారు.

- Advertisement -

రాష్ట్రంలో యువతకు ఉపాధి లేకుండా పోయిందని రాష్ట్రంలో ఏ ఒక్క పరిశ్రమను కూడా తెరవకుండా చదువుకున్న వారిని నిరుద్యోగులుగా చేస్తున్న ఈ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ని గద్దె తింపేంతవరకు యువత పోరాటం చేయాలని రాబోయే 2024 ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు సీఎం చేసుకుని నంద్యాలలో ఎన్ఎండి ఫరూక్ ని ఎమ్మెల్యేగా గెలిపించుకొని అటు రాష్ట్రం ఇటు నంద్యాల రెండిటిని అభివృద్ధి చేసుకోవాలసిన బాధ్యత మనందరి పైన ఉందని కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించి మన అభివృద్ధిని మనమే చేసుకునే విధంగా మన జీవితాన్ని మనమే తీర్చుదిద్దుకునే విధంగా ముందుకు అడుగులు వేయాలని వారు తెలియజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News