అలనాటి సినీ నటి, నిర్మాత కృష్ణవేణి(Krishnaveni) మృతిపై మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్(Jagan) సంతాపం తెలియజేశారు. ప్రతిష్ఠాత్మక రఘుపతి వెంకయ్య అవార్డు అందుకున్న కృష్ణవేణి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
- Advertisement -
“కృష్ణవేణి అనేక భాషల్లో నటించి బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరొందారు. నటిగా తనదైన ముద్రవేసిన ఆమె మృతి సినీ రంగానికి తీరని లోటు. అనేక గొప్ప చిత్రాలు నిర్మించి నిండు నూరేళ్లు సంపూర్ణంగా జీవించి పరమపదించిన ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను. ఈ సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అంటూ జగన్ పేర్కొన్నారు.