Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Jagan: కళ్యాణమస్తు బటన్‌ నొక్కి వధువుల తల్లుల ఖాతాల్లో జమ చేసిన సీఎం జగన్

Jagan: కళ్యాణమస్తు బటన్‌ నొక్కి వధువుల తల్లుల ఖాతాల్లో జమ చేసిన సీఎం జగన్

వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా, సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ నుంచి బటన్‌ నొక్కి వధువుల తల్లుల ఖాతాల్లో జమ చేసిన సీఎం వైఎస్‌ జగన్‌.

- Advertisement -

చదువులకు మరింత ఊతమిస్తూ… వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా.

జూలై– సెప్టెంబర్, 2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 10,511 జంటలకు వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా క్రింద రూ.81.64 కోట్ల ఆర్ధిక సాయాన్ని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి తల్లుల ఖాతాల్లో జమ చేసిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.

ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే….:

ఈ రోజు దేవుడి దయతో మరోమంచి కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా చేయగలుగుతున్నాం. పేదతల్లిదండ్రులు తమ పిల్లలను గొప్పగా చదవించి, వారికి గౌరవప్రదంగా పెళ్లిళ్లు చేసి, వారి వివాహ జీవితాలను మొదలుపెట్టించేందుకు సహాయంగా ఉండే మంచి కార్యక్రమం ఇవాళ జరుగుతుంది.

చేయిపట్టుకుని నడిపిస్తున్నాం
పేద వర్గాలైన ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికులు అందరినీ ప్రతి సందర్భంలో నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ అంటూ వారి మీద ఓనర్‌ షిప్‌ తీసుకుంటూ, వాళ్లంతా ప్రభుత్వంలో అత్యంత ముఖ్యమైన వాళ్లు అంటూ భరోసా ఇస్తూ, చేయి పట్టుకుని నడిపిస్తున్నాం.

10,511 జంటలకు రూ.81.64 కోట్ల లబ్ధి.
ఈ రోజు ఈ పథకం ద్వారా జూలై నుంచి సెప్టెంబర్‌ దాకా జరిగిన పెళ్లిళ్లకు సంబంధించి 10,511 మంది జంటలను ఆశీర్వదిస్తూ వారికి ఇవాళ రూ. 81.64 లక్షల ఆర్థిక సాయాన్ని బటన్‌ నొక్కి నేరుగా వారి తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తున్నాం.

ఈ పథకంలో ఇప్పటి వరకు 3 త్రైమాసికాల్లో మూడు విడతల్లో ఈ ఆర్థిక సాయం అందించాం. 2022 అక్టోబర్‌ నుంచి మొదలు పెడితే ఇవాళ్టికి.. ఈరోజు ఇస్తున్న నాలుగో విడతతో కలిపి మొత్తం 46,062 జంటలకు రూ.349 కోట్లు ఆ తల్లుల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతోంది.

గతానికీ నేటికీ తేడా
గత ప్రభుత్వంలో ఈ పరిస్థితి ఎలా ఉండేదని ఒక్కసారి బేరీజు వేసుకుంటే కొన్నివిషయాలు ఆశ్చర్యకరంగా అనిపిస్తాయి. గత ప్రభుత్వం ఏనాడూ నిజాయితీతో, చిత్తశుద్ధితో ఒక మంచి పథకం తీసుకురావాలని, దానివల్ల పేదవాళ్లకు మంచి జరగాలని అడుగులు పడలేదు.
ఒక పథకం తీసుకొస్తే ఒక ఉండాలి. ఆ ఉద్దేశం, సంకల్పం మంచిదైతే దేవుడు ఆ సంకల్పాన్ని ఆశీర్వదిస్తాడు. చేసే మంచి మనసుని ఆశీర్వదిస్తాడు. పరిస్థితులు దాన్ని చేయడానికి అన్ని రకాలుగా కలిసి వస్తాయి. అటువంటి మంచి సంకల్పంతో అడుగులు ముందుకు వేసిన పథకం ఈ కళ్యాణమస్తు, షాధీ తోఫా పథకం.

ఓట్లు కోసం కాదు- విజన్‌తో అడుగులు
ఈ పథకం ప్రకటించేటప్పుడు ఎందుకు పదో తరగతి సర్టిఫికెట్, 18 సంవత్సరాలు తప్పని సరి అని నాతో చాలా మంది అన్నారు. అందరికీ ఇస్తే ఎక్కువ ఓట్లు వస్తాయన్నారు. నేను ఒకటే అన్నాను. ఓట్లు అన్నది, ఎన్నికలన్నవి సెకండరీ. లీడర్లుగా మనం ఉన్నప్పుడు మన సంకల్పం మంచిదై ఉండాలి. విజన్‌ మోస్ట్‌ ఇంపార్టెంట్‌. ఈరోజు మనం వేసే ప్రతి అడుగులోనూ విత్తనం వేస్తున్నాం. ఈరోజు ఇదొక ప్రేరణ అంశం కావాలి.
10వ తరగతి సర్టిఫికెట్, 18 ఏళ్లు వధువుకు, 21 ఏళ్లు వరుడికి కనీస వయస్సు ఉండాలని చెబుతామో.. దానివల్ల బాల్య వివాహాలు పూర్తిగా తగ్గిపోవడమన్నది వాస్తవ రూపం దాల్చుతుంది. ఇదొక పరిష్కారం.
రెండోది 10వ తరగతి సర్టిఫికెట్‌ తప్పనిసరి చేయడం వల్ల ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల్ని చదివించేందుకు మరింత ఊతం ఇస్తుంది. అమ్మఒడి అనే పథకం ఇప్పుడు ప్రతి తల్లిని మోటివేట్‌ చేయిస్తూ… తమ పిల్లలను చదివించే విధంగా అడుగులు వేయిస్తుంది.

విద్యా వ్యవస్ధ- సమూల మార్పులు
ఇప్పుడు గవర్నమెంట్‌ బడుల రూపురేఖలు మారుతున్నాయి. వాటిలో ఇంగ్లీషు మీడియం చదువులు వచ్చాయి. నాడు నేడుతో రూపురేఖలు మారుతున్నాయి. 6వ తరగతి నుంచి ఏకంగా డిజిటల్‌ బోధనను క్లాస్‌రూమ్‌లోనే అందుబాటులోకి తీసుకువస్తూ.. ఐఎఫ్‌పీల బోధన కూడా అందుబాటులోకి వచ్చింది. 3వ తరగతి నుంచి సబ్జెక్ట్‌ టీచర్‌ కాన్సెఫ్ట్, 8వ తరగతి పిల్లలకు ట్యాబ్స్, బైలింగువల్‌ టెక్ట్స్‌బుక్స్‌తో పిల్లలు గొప్పగా ఎదగాలని తాపత్రయపడుతూ అడుగులు వేస్తున్నాం.

తల్లులనూ మోటివేట్ చేస్తూ…
వీటన్నింటికీ తోడుగా పిల్లలను బడులకు పంపేవిధంగా… తల్లులను మోటివేట్‌ చేస్తూ అమ్మ ఒడి తెచ్చాం. దీనివల్ల తల్లులు తమ పిల్లలను బడులకు పంపేలా మోటివేట్‌ అవుతున్నారు.
10వ తరగతి సర్టిఫికెట్‌ తప్పనిసరి చేయడం వల్ల కచ్చితంగా పదో తరగతి వరకు చదువుతారు. 18 సంవత్సరాల వరకు ఆగాలి, అమ్మ ఒడి వర్తిస్తుంది కాబట్టి పిల్లలను ఇంటర్‌ కూడా చదివిస్తారు.
దానివల్ల తల్లిదండ్రులకు నష్టం లేదు. అమ్మ ఒడి ద్వారా ఆదాయం వస్తుంది. ఒక్కసారి ఇంటర్‌ వరకు పిల్లలను చదివించాక.. ఆ తర్వాత విద్యా దీవెన, వసతి దీవెన అందుబాటులో ఉన్నాయన్నది మెదడుకు తడుతుంది.

అప్పుడు విద్యాదీవెన వీటి ద్వారా పూర్తి ఫీజు అందుతుందని, రూపాయి కూడా ఖర్చు లేకుండా పిల్లలను చదివించగలమని తడుతుంది. అంతే కాకుండా కాలేజీలలో పిల్లలను చేరిస్తే… వసతి దీవెన కింద రూ.20 వేల వరకు సంవత్సరానికి వస్తుందన్నది తడుతుంది. అప్పుడు పిల్లల్ని గ్రాడ్యుయేషన్‌ వరకు చదివించేందుకు తల్లిదండ్రులు మోటివేట్‌ అవుతారు. అప్పుడు గ్రాడ్యుయేట్స్‌ అయ్యే దాకా పిల్లలను తీసుకుపోయే కార్యక్రమం జరుగుతుంది. ఒక్కసారి పిల్లలు గ్రాడ్యుయేట్‌ స్ధాయిలోకి చదివించగలగడం వల్ల అప్పుడు జనరేషన్‌ చేంజ్‌ వస్తుంది.

చదువు- పిల్లల తలరాతలు మార్చే అస్త్రం
చదువు అనే అస్త్రంతో పిల్లల తలరాతలు మార్చే గొప్ప వ్యవస్థ పరిస్థితి ఏర్పడుతుంది. పిల్లలు పేదరికం నుంచి బయటపడే గొప్ప పరిస్థితి కూడా ఏర్పడుతుంది. వీటన్నింటినీ మనసులో పెట్టుకొని ఈ పథకం తెచ్చాం.
గతంలో మనం అధికారంలోకి రాకమునుపు… ఇదే పథకానికి పదో తరగతి ఇన్‌సిస్ట్‌ చేసే పరిస్థితి లేదు. అది కూడా అరకొరగా ఇచ్చారు. 2018కి పథకమే పక్కన పడేశారు. ఇంత మందికి ఇచ్చే పరిస్థితి ఎప్పుడూ లేదు, ఎప్పుడిస్తారో తెలియదు. ఇచ్చేదాంట్లో పారదర్శకత, మోటివేషన్, చిత్తశుద్ధి లేదు.

కానీ ఈరోజు మనం చిత్తశుద్ధి, మోటివేషన్‌తో పారదర్శకతతో ప్రతి ఒక్కరికీ మంచి చేయాలని, ఏ ఒక్కరు మిస్‌ కాకూడదనే తపన, తాపత్రయంతో ప్రతి క్వార్టర్‌ అయిపోయిన వెంటనే ఒక నెల వెరిఫికేషన్, దాని తర్వాత మరుసటి నెల కల్యాణమస్తు, షాదీ తోఫా తల్లుల ఖాతాల్లో జమ చేసే పద్ధతి తెచ్చాం. దీనివల్ల గొప్ప మార్పు జరుగుతుంది.

చదువులను ప్రోత్సహించేందుకు..
ఇక ఈ కార్యక్రమంలో గతంలో మైనార్టీలకు రూ.50 వేలు మాత్రమే.. కొంత మందికే ఇచ్చారు. అది కూడా ఎప్పుడిస్తారో తెలియదు.
ఇవాళ మనం మైనార్టీలకు ఏకంగా లక్ష రూపాయలు ఇస్తున్నాం. అది కూడా పదో తరగతి పాస్‌ అయ్యుండాలని చెబుతున్నాం. పిల్లలను చదివించడం కోసం ఈ రూ.1లక్ష మైనార్టీలకు ఊతమిచ్చే అంశం అవుతుంది. వికలాంగులకు రూ.1.50 లక్షలు ఈ పథకం ద్వారా ఇస్తున్నాం. ఎస్సీలకు గత ప్రభుత్వం రూ.40వేలు మాత్రమే ఇస్తే… మనం రూ.1లక్ష ఇస్తున్నాం. ఎస్టీలకు కూడా గత ప్రభుత్వంలో రూ.50 వేలు ఇస్తే మనం రూ.1లక్ష ఇస్తున్నాం. బీసీలకు రూ.35వేలు మాత్రమే ఇచ్చే పరిస్థితి నుంచి ఇప్పుడు రూ.50 వేలు ఇస్తున్నాం. ఎస్సీ ఎస్టీలకైతే… కులాంతర వివాహాలకు అయితే ఏకంగా రూ.1.20 లక్షలు ఇస్తున్నాం. ఇలా చదువులను ప్రోత్సహించడం కోసం, తల్లిదండ్రులంతా పిల్లల్ని చదివించే దిశగా అడుగులు వేయించేలా చేస్తున్నాం. దీనివల్ల ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్న వాళ్లందరికీ కూడా మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం ఇంకా ప్రజల్లోకి పోయే కొద్దీ చాలా మందికి మోటివేషన్‌ దిశగా అడుగులు వేయించాలని తపన, తాపత్రయం పడుతున్నాం. దేవుడు ఇటువంటి మంచి కార్యక్రమానికి ఎప్పుడూ ఆశీర్వదించాలని కోరుతూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం.

మార్పుకు చిహ్నం
ఇందులో చాలా సంతోషకరమైన విషయం ఏమిటంటే.. ఇవాళ కల్యాణమస్తు, షాదీ తోఫా కింద ఇప్పుడు 10,511 జంటలకు ఇస్తున్న వారిలో 8,042 మందికి అమ్మ ఒడి లేదా జగనన్న విద్యా దీవెన లేదా జగనన్న వసతి దీవెన కింద ప్రయోజనాలు అందాయన్న విషయం చాలా సంతోషం కలిగిస్తోంది.ఇది గొప్ప మార్పుకు చిహ్నం.
రాబోయే రోజుల్లో, రాబోయే నెలల్లో, రాబోయే సంవత్సరాల్లో 100 శాతం కింద రిజిస్టర్‌ కావాలని తపన, తాపత్రయ పడుతూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాను అని సీఎం తన ప్రసంగం ముగించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News