Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Jagan Ugadi: శావల్యాపురంలో మేమంతా సిద్ధం బస్ యాత్రలో ఉగాది

Jagan Ugadi: శావల్యాపురంలో మేమంతా సిద్ధం బస్ యాత్రలో ఉగాది

శ్రీ క్రోధి నామ సంవత్సరాది సందర్భంగా..

మేమంతా సిద్ధం బస్సు యాత్రలో శావల్యాపురం మండలం గంటావారిపాలెం వద్ద క్యాంప్‌లోనే శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా సాగాయి. శ్రీ క్రోధి నామ సంవత్సరాది సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.

- Advertisement -

ఉగాది వేడుకలకు హాజరయ్యారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్, వైఎస్‌ భారతి దంపతులు. సీఎం వైఎస్‌ జగన్‌ దంపతులకు వేద ఆశీర్వచనం, తీర్ధ ప్రసాదాలను అందించారు వేద పండితులు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ నరసరావుపేట ఎంపీ అభ్యర్ధి అనిల్‌కుమార్‌ యాదవ్, వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, లేళ్ళ అప్పిరెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News