Sunday, November 16, 2025
Homeఆంధ్రప్రదేశ్Jawan Suicide: సహోద్యోగుల కళ్లెదుటే తుపాకీతో కాల్చుకుని జవాన్‌ ఆత్మహత్య

Jawan Suicide: సహోద్యోగుల కళ్లెదుటే తుపాకీతో కాల్చుకుని జవాన్‌ ఆత్మహత్య

Jawan Suicide INS Kalinga: విశాఖలోని భీమిలి నౌకాదళ కేంద్రం(INS కళింగ) ప్రాంగణంలో శనివారం ఓ జవాన్‌ ఆత్మహత్యకు  పాల్పడ్డాడు. విధుల్లో ఉన్న ఓ డిఫెన్స్ సెక్యూరిటీ కోర్(డీఎస్‌సీ) జవాన్, తన సర్వీస్ తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. డీఎస్‌సీ సిపాయిగా ఐఎన్ఎస్ కళింగలో విధులు నిర్వర్తిస్తున్న బాపట్ల జిల్లాకు చెందిన బాజీ బాబా షాహిక్ (44).. ఈ రోజు తన వద్ద ఉన్న ఏకే-47 సర్వీస్ రైఫిల్‌తో అకస్మాత్తుగా కాల్చుకున్నారు. దీంతో ఆయనతో పాటు విధుల్లో ఉన్న తోటి సిబ్బంది, సహోద్యోగులు ఒక్కసారిగా ఉలిక్కిపడటంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/ap-cm-expressed-deep-anguish-over-the-incident-in-visakhapatnam-where-several-children-were-injured-after-hot-gruel/

తీవ్రంగా గాయపడిన షాహిక్‌ను సిబ్బంది, సహోద్యోగులు చికిత్స నిమిత్తం హుటాహుటిన సమీప ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై భీమిలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుటుంబ సమస్యలు, వ్యక్తిగత కారణాలు లేదా మానసిక ఒత్తిడి ఏమైనా షాహిక్‌ ఆత్మహత్యకు దారి తీసిందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad