Wednesday, April 2, 2025
Homeఆంధ్రప్రదేశ్Kabaddi: అంతర్ రాష్ట్ర మహిళల కబడ్డీ పోటీలు ప్రారంభం

Kabaddi: అంతర్ రాష్ట్ర మహిళల కబడ్డీ పోటీలు ప్రారంభం

వైయస్ఆర్ అంతర్ రాష్ట్ర మహిళా ప్రో కబడ్డీ పోటీలు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ప్రారంభం అయ్యాయి. స్థానిక మున్సిపల్ ఇండోర్ స్టేడియంలో వైయస్ఆర్ అంతర్ రాష్ట్ర మహిళా ప్రొ కబడ్డీ పోటీలను ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి సతీమణి కె నిరుపమ రెడ్డి ప్రారంభించారు. ఎమ్మిగనూరు శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా.. ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి, వైసిపి నాయకుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ క్రీడా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నిరుపమ మాట్లాడుతూ మహిళలు కబడ్డీ పోటీలలో ఉత్తమ ప్రతిభ ను కనపరిచి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News