పాణ్యం నియోజకవర్గం కల్లూరు మండలం ఉలిందకొండ గ్రామంలో ఉమ్మడి టీడీపీ-జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి భారీ ఎత్తున ర్యాలీ కార్యక్రమం జరిగింది. జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని జెండాను పాణ్యం మాజీ ఎమ్మెల్యే పాణ్యం ఎమ్మెల్యే టిడిపి అభ్యర్థి గౌరు చరిత రెడ్డి, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు చింత సురేష్ జెండా ఆవిష్కరించారు .
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2024/03/5856b1a3-32cc-4cd0-b8b0-4775a43028b4-1024x768.jpg)
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు సుబ్బయ్య, టీడీపీ గ్రామ నాయకులు ఇవి రమణ, కరీం, దస్తగిరి, రంగ స్వామి రెడ్డి, ఇద్దం శ్రీకాంత్, జనసేన గ్రామ నాయకులు రాజు, రాకేష్ కుమార్, శ్రిమన్, కురువ రాజు, నరసింహ, కిట్టయ్య, వర ప్రసాద్, సుధాకర్, తడకనపల్లే సలాం, షబ్బీర్, టిడిపి మైనార్టీ నాయకులు దొడ్డిపాడు మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు.