Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Kalluru TDP: ప్రజా కోర్టులో బుద్ది చెప్పండి

Kalluru TDP: ప్రజా కోర్టులో బుద్ది చెప్పండి

కల్లూరు రజకుల పోరుబాట కార్యక్రమం

కల్లూరు స్థానిక టిడిపి నియోజకవర్గం కార్యాలయంలో రజక సాధికార కమిటి జిల్లా అధ్యక్షులు రమణ ఆధ్వర్యంలో రజకుల పోరుబాట కార్యక్రమం నిర్వహించారు . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు… అనంతరం అయన మాట్లాడుతు రజకులకు నిధులు కుర్చీలు లేని పదవులు ఇచ్చి రజకులను వైసిపి పార్టీ మోసం చేసిందని రజకులకు పనికిరాని కోర్పొరేషన్ పదవులు ఇచ్చి ఎటువంటి పదవులు ఇవ్వకుండ రజకులను వైసిపి మోసం చేసిందని ప్రజాకోర్టులో ప్రజలను చైతన్య పరచి వైసిపికి బుద్ది చెప్పాలన్నారు.. టిడిపి జిల్లా కోఆర్డినేటర్. బిసి సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వడ్డే తిరుపాల్ బాబు మాట్లాడుతు టిడిపి ప్రభుత్వం లో బిసి సబ్ ప్లాన్ ప్రవేశపెట్టి ఆదరణ పతకం ద్వారా బిసిలకు ఆర్థికంగ. పరిపుష్టి కల్పించిన ఘనత నారా చంద్రబాబు నాయుడుకే దక్కిందన్నారు…

- Advertisement -


టిడిపి బిసి సెల్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి వెంపెంట రాంబాబు మాట్లాడుతు. టిడిపి హయాంలో రజకులకు వాషింగ్ మిషన్లు, ఇస్త్రీ పెట్టెలు, లాంటివి అందించటమే కాక దోబిగాట్లు నిర్మాణం చేసి రజకులకు తోడ్పాటు అందించారన్నారు.. ఈ కార్యక్రమంలో టిడిపి పార్టీ జిల్లా కార్యదర్శి కేతురి మధు,రజక సాధికార కమిటి రాష్ట్ర కమిటి సభ్యులు సీపీ వెంకటేశ్వర్లు, కర్నూలు పార్లమెంట్ అధ్యక్షులు గణేష్, బెస్త సాధికార కమిటి నంద్యాల జిల్లా అధ్యక్షులు పిజి. వెంకటేష్, టిడిపి నాయకులు నాగరాజు, రజక సంఘము నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు….

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News