Thursday, July 4, 2024
Homeఆంధ్రప్రదేశ్Kalluru: గ్రామ వాలంటీర్లను సన్మానించిన కాటసాని

Kalluru: గ్రామ వాలంటీర్లను సన్మానించిన కాటసాని

కల్లూరు మండలంలోని, గ్రామాలు ఉలిందకొండ, కొంగణపాడు, నాయకళ్ళు, తడకనపల్లె, చిన్న టేకురు,పెద్ద టేకురు, బస్తిపాడు, బొల్లవరం గ్రామాలలోని వాలంటీర్లతో ‘వాలంటీర్లకు వందనం-2023’ సమావేశం ఉలిందకొండ గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా, పాణ్యం ఎమ్యెల్యే-టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా సేవలందించిన వాలంటీర్లకు సేవా వజ్ర, సేవా రత్న,సేవా మిత్ర పురస్కారాలు ఎమ్యెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అందజేశారు.
ఈ కార్యక్రమంలో…ఉలిందకొండ కెవి.రమణారెడ్డి, ఉలిందకొండ గ్రామంలోని వైఎస్సార్ సీపీ నాయకులు… ఏ.వి.రమణ, శ్రీనివాసులు, కాశీ విశ్వనాథ్, శీనయ్య, నాగేష్, కర్నూలు జిల్లా కెడిసిసి బ్యాంక్ డైరెక్టర్ కల్లా వెంకట రమణారెడ్డి, కల్లూరు సింగిల్ విండో ప్రెసిడెంట్ శివ శంకర రెడ్డి,కార్పొరేటర్ దండు లక్ష్మీకాంత్ రెడ్డి, సల్కాపురం సర్పంచ్ మద్దిలేటి, వైఎస్సార్ సీపీ నాయకులు,పెద్ద టేకురు హనుమంతు రెడ్డి, రేమ డూరు నారాయణ రెడ్డి, పుసులూరు రామకృష్ణ రెడ్డి, చిన్న టేకురు ఈశ్వరయ్య, ఎంపీటీసీ మునిస్వామి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ విభాగం నంద్యాల జిల్లా అధ్యక్షుడు యూనిస్ భాష, ఇంకా పలువురు గ్రామంలోని మండలంలోని నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News