Thursday, July 4, 2024
Homeఆంధ్రప్రదేశ్Kalluru: వైసిపి ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరిస్తున్నారు: ఎమ్మెల్యే కాటసాని

Kalluru: వైసిపి ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరిస్తున్నారు: ఎమ్మెల్యే కాటసాని

వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరిస్తున్నారని ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు.  పాణ్యం నియోజకవర్గ పరిధిలోని, కల్లూరు అర్బన్లో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో పాల్గొన్నారు కాటసాని.  స్వయంగా వార్డులోని ఇళ్లను సందర్శించి వారితో కాసేపు మాట్లాడి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ, ఆ సంక్షేమ పథకాల్లో వారి కుటుంబానికి ఏవేవి వస్తున్నాయో కనుక్కుంటూ, ఈసారి కూడా మన జగనన్నకు సంపూర్ణ మద్దతు తెలపాలని కోరారు. అనంతరం ఇంటింటికి మా నమ్మకం నువ్వే జగన్ అనే స్టికర్ ను అతికించి ముందుకు సాగారు.

- Advertisement -

ఈకార్యక్రమంలో వార్డ్ కార్పొరేటర్ సంగాల సుదర్శన్ రెడ్డి, కల్లూరు సింగిల్ విండో ప్రెసిడెంట్ శివ శంకర రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల పార్లమెంట్ యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి శివారెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు తిరుమల్లేష్ గౌడ్, నాగేశ్వర రెడ్డి ఇంకా వార్డులోని పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, వార్డ్ కన్వీనర్లు, గృహ సారథులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News