Thursday, July 4, 2024
Homeఆంధ్రప్రదేశ్Katasani: వైసిపితోనే అభివృద్ధి సాధ్యం

Katasani: వైసిపితోనే అభివృద్ధి సాధ్యం

వైసీపీ ప్రభుత్వంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంపాల్ రెడ్డి అన్నారు. అనంతరం పాణ్యం ఎమ్యెల్యే, టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు మరియు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షులు .కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు పాణ్యం నియోజకవర్గ పరిధిలోని కల్లూరు అర్బన్:27 వార్డ్ : 69 వ సచివాలయం పరిధిలోని అబ్బాస్ నగర్ లో గడప,గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు.
ఎమ్యెల్యే వార్డులోని ప్రతీ గడపకు వెళ్లి రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న జనరంజక పాలన,అవినీతి రహిత పాలన గురించి ప్రజలకు వివరిస్తూ, జగనన్న ప్రభుత్వాన్ని దీవించా లని కోరారు.ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అర్హత కలిగిన ప్రతీ ఒక్కరికీ అందేలా చూడాలని సంబంధిత సచివాలయ సిబ్బందిని ఎమ్మెల్యే ఆదేశించారు .
ఈకార్యక్రమంలో…స్థానిక వార్డ్ కార్పొరేటర్ పల్లె శారద,రవీంద్ర విద్యా సంస్థల అధినేత పుల్లయ్య,కార్పొరేటర్ & స్టాండింగ్ కమిటీ మెంబర్ సాన శ్రీనివాసులు,కార్పొరేటర్ దండు లక్ష్మీకాంత్ రెడ్డి, కార్పొరేటర్ మరియు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జోనల్ ఇంచార్జ్ శ్వేతారెడ్డి,కల్లూరు సింగిల్ విండో ప్రెసిడెంట్ శివ శంకర రెడ్డి,ఆంధ్రప్రదేశ్ వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ డైరెక్టర్ నల్లబోలు గోపాల్ రెడ్డి,వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాటి పుల్లారెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు…రంగప్ప,శ్రీనివాస్ రెడ్డి,తిరుమలేష్ గౌడ్,శంకర్ రెడ్డి,27 వ వార్డులోని వైఎస్సార్ సీపీ నాయకులు…పల్లె శ్రీనాథ్ రెడ్డి,భాస్కర్ రెడ్డి, బ్రహ్మానంద రెడ్డి,సిద్దు,సుధాకర్ రెడ్డి,సాయి,పెద్ది,రాఘవ,సుబ్రహ్మణ్యం, వెంకటరెడ్డి ఇంకా పలువురు నాయకులు, కార్యకర్తలు,సచివాలయ సిబ్బంది,వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News