ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి స్వగృహంలో 19వ విడతలో భాగంగా పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 16 మంది లబ్ది దారులకు 16 లక్షల 35,000 వేల రూపాయలు చెక్కులను బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ 19 విడతల్లో ఇప్పటి వరకు బనగానపల్లె నియోజకవర్గంలోని 883 లబ్ధిదారులకు 5 కోట్ల 24 లక్షల 99 వేల 500 వందల రూపాయల చెక్కులను పేదలకు ఆరోగ్య చికిత్స కొరకు అందించామన్నారు. ఆరోగ్య శ్రీ పరిధిలో లేని జబ్బులను మాత్రమే ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థికంగా ఆదుకుంటామన్నారు. ఆరోగ్య శ్రీ తరువాత ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరం లాంటిది అని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైయస్సార్ పార్టీ రైతు విభాగం మాజీ అధ్యక్షుడు మంగవరపు శివ రామిరెడ్డి, పార్టీ ప్రచార కార్యదర్శి సిద్దం రెడ్డి రామ్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/09/c2b309cf-8d77-4bc6-abae-e2f1016aa01f-1024x576.jpg)