Tuesday, July 2, 2024
Homeఆంధ్రప్రదేశ్Katasani: యాగంటిలో ఎమ్మెల్యే దంపతుల పూజలు

Katasani: యాగంటిలో ఎమ్మెల్యే దంపతుల పూజలు

యాగంటి ఆలయం అభివృద్ధి పనుల్లో ఎమ్మెల్యే

బనగానపల్లె మండలంలోని ప్రముఖ శైవ క్షేత్రమైన యాగంటి శ్రీ ఉమామహేశ్వరస్వామి దేవస్థానంలో నూతనంగా నిర్మించ తలపెట్టిన టీటీడీ కల్యాణ మండపం నిర్మాణానికి కల్యాణ మండపం స్థలదాత, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఆయన సతీమణి శ్రీమతి కాటసాని ఉమామహేశ్వరమ్మ దంపతులు భూమి పూజచేశారు.

- Advertisement -

అంతకుముందు ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్ రెడ్డి కుటుంబసమేతంగా ఆలయ గర్భగుడిలో స్వామివారికి అర్చన, ప్రత్యేక అభిషేకాలు చేసారు. వారికి ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి, చైర్మన్ తోట బుచ్చిరెడ్డిలు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, శాలువలతో సత్కరించి, తీర్థ ప్రసాదాలు అందచేశారు. అనంతరం వారు కళ్యాణమండపం నిర్మాణానికి సంబంధించి భూమిపూజ కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాటసాని మాట్లాడుతూ యాగంటి పరిసర ప్రాంతాల గ్రామస్తులు ,సామాన్య భక్తులు తక్కువ ఖర్చుతో వారి ఇంట జరిగే శుభకార్యాలు జరుపుకోవలన్న సేవా సంకల్పంతో ఈ కళ్యాణమండపం నిర్మాణ చేపట్టినట్లు తెలిపారు. తమ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం వితరణ గావిస్తున్న శ్రీ ఉమామహేశ్వర నిత్యాన్నదాన సత్రం సేవా ట్రస్ట్ తరపున కల్యాణ మండపం నిర్మాణం కొరకు ఎకరా స్థలం, రూ.30 లక్షలు కాంట్రిబ్యూషన్ ఇవ్వడంతో టీటీడీ దేవస్థానం కళ్యాణ మండపం నిర్మాణానికి రూ.3 కోట్లు కార్ఫస్ ఫండ్ కింద నిధులను మంజూరు చేసిందని అన్నారు. ఏడాదిలోగా నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాటసాని తనయుడు , వైకాపా యువనేత కాటసాని శివ నరసింహారెడ్డి, ఆయన సతీమణి కాటసాని రూపశ్రీరెడ్డి, ఎమ్మెల్యే కుమార్తె ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి, ఆలయ ఛైర్మన్ తోట బుచ్చిరెడ్డి, శ్రీ ఉమామహేశ్వర స్వామి నిత్యాన్నదాన సేవా ట్రస్ట్ ఉపాధ్యక్షులు మల్కిరెడ్డి దస్తగిరిరెడ్డి, ప్రధాన కార్యదర్శి దోనపాటి యాగంటిరెడ్డి, ట్రెజరర్ వై రామారెడ్డి, జమ్మి సుబ్బారెడ్డి, మహేశ్వర రెడ్డి ఆలయ పూజారులు మహేశ్ శర్మ, సత్యనారాయణ శర్మ, దేవేంద్రశర్మ, రాఘవేంద్ర శర్మ, కిషోర్ శర్మ,మంజునాథ్ శర్మ, కర్నూలుకు చెందిన కమలసాయి శర్మ, ఆలయ సిబ్బంది రమేష్ కుమార్,టీటీడీ డీ ఈ మన్మధరావ్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News