Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Katasani: కొత్త కాలనీల అభివృద్ధికి ప్రాధాన్యం

Katasani: కొత్త కాలనీల అభివృద్ధికి ప్రాధాన్యం

మేయర్ బి.వై. రామయ్య, ఎమ్మెల్యే కాటసాని

కల్లూరు నగరంలో ఏర్పడిన కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు నగర మేయర్ బి.వై. రామయ్య, ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. 19వ వార్డు మథర్ ల్యాండ్ లో 65 లక్షలతో సిసి డ్రైన్ నిర్మాణానికి మేయర్, ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగర శివార్లలో అనతి కాలంలోనే అనేక కాలనీలు ఏర్పడ్డాయని, అందుకు తగ్గట్టుగా అక్కడ మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం నగరంపై చూపిన చిన్నచూపు కారణంగా ఇప్పటికి ఎన్నో సమస్యలు తిష్ట వేసి ఉన్నాయని విమర్శించారు.

- Advertisement -

కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ బెల్లం మహేశ్వర రెడ్డి,‌ రాష్ట్ర వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎన్.గోపాల్ రెడ్డి, కార్పొరేటర్‌ లక్ష్మిరెడ్డి, ఎం.ఈ. శేషసాయి, డిఈఈ రవిప్రకాష్ నాయుడు, ఏఈ జనార్ధన్, ఇంస్పెక్టర్లు రఫిక్, ఆర్.రాజు, నాయకులు అనిల్ కుమార్, బాబుల్ రెడ్డి, లక్ష్మీపతి, తిరుపాలు, చిన్న, రసూల్, శ్రీనివాస యాదవ్, రాజేష్, సంతోష్, రమణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News