తడకనపల్లె గ్రామంలో ఆనియన్స్ డ్రై మిషన్ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు పాణ్యం ఎమ్యెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఆయన సతీమణి కాటసాని ఉమామహేశ్వరమ్మ, కుమార్తె కుమారి కాటసాని మాధవి లతారెడ్డిలు ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ జీవనోపాధి కోసం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని దాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మహిళలకు హితవు పలికారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలనే ఆకాంక్షతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పథకాలు పెడుతున్నారని ఆయన వారికి తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఏపీఎంఐపీ PD ఉమాదేవి, డిఆర్డిఏ పిడి వెంకట సుబ్బయ్య, తడకనపల్లె వైఎస్సార్ సీపీ నాయకులు… కృష్ణారెడ్డి, వెంకటేశ్వర రెడ్డి,కల్లూరు ఎంపీపీ శారద,సర్పంచ్, ఎంపిటిసి, పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు, పొదుపు సంఘ ఐక్య నాయకురాలు జుబేదా సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/06/762594e2-8277-4a11-be99-e8a60c54bf31-473x1024.jpg)
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/06/fc664588-ef6d-46a3-bbfb-f6e9b8c91c95-473x1024.jpg)