Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Kautalam: వైభవంగా ఆంజనేయస్వామి ఉత్సవాలు

Kautalam: వైభవంగా ఆంజనేయస్వామి ఉత్సవాలు

పులిగట్టు ఆంజనేయ స్వామికి..

కౌతాళం మండలం ఏరిగేరి గ్రామంలో వెలసిన పులిగట్టు ఆంజనేయస్వామి మహోత్సవ వేడుకలు మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించారు.. ప్రతి సంవత్సరం అమావాస్య రోజున గ్రామపెద్దలు అధ్వర్యంలో కొండపై వెలసిన పులిగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం గ్రామంలో స్వామి పల్లకోత్సవం మేళాలు తాళాలు, డప్పు వాయిద్యాల నడుమ పురవీధుల గుండా ఘనంగా నిర్వహించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రసాదం అందజేసి, శాలువా పూలమాలతో సన్మానించి ఆశీర్వదించారు. అనంతరం పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని, మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ బాధ్యులు పాలకుర్తి తిక్కారెడ్డి గెలవాలని, రాష్ట్ర ప్రజలు, రైతులు అందరు బాగుండాలని పూజలు చేశామన్నారు.

ఈ కార్యక్రమంలో తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి అడివప్ప గౌడు, టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు చేన్నబసప్ప , తెలుగు రైతు జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటపతి రాజు, తెలుగు రైతు జిల్లా కార్యదర్శి యల్లారెడ్డి,టిడిపి బీసీ సెల్ జిల్లా కార్యదర్శి కురుగోడు, డాక్టర్ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు రాజానంద్, బిసి సాధికార సభ్యులు సిద్ధు,ఏరిగేరి బసవరాజు, నాగేష్ , రంగాస్వామి,నరసప్ప ,వీరేష్, కావాలి ఈరప్ప, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News