Friday, October 18, 2024
Homeఆంధ్రప్రదేశ్Kautalam: వైయస్సార్ ఆసరా సంబరాలు

Kautalam: వైయస్సార్ ఆసరా సంబరాలు

మంత్రాలయం నియోజకవర్గం కౌతాళం మండల కేంద్రంలో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు వైయస్సార్ ఆసరా సంబరాలు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.  మండలంలో దాదాపుగా 830 గ్రూపులకు  326. 87 లక్షల రూపాయల చెక్కులను వైయస్సార్ ఆసరా పథకం కింద పొదుపు సంఘాల లబ్ధిదారులకు  వైసీపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వై ప్రదీప్ రెడ్డి చేతుల మీదుగా అందించారు.  కార్యక్రమంలో ప్రదీప్ రెడ్డి గారు మాట్లాడుతూ పాదయాత్రలో మహిళలకు ఇచ్చిన హామీల మేరకు 14 ఏప్రిల్ 2019 వరకు ఉన్న పొదుపు సంఘాల మొత్తం రుణాన్ని మాఫీ చేసి ఇప్పటికే రెండు విడతల్లో లబ్ధిదారుల ఖాతాలో జమ చేసిన ముఖ్యమంత్రి మూడో విడత కింద ఈరోజు 326.87 లక్షల రూపాయలను లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా నగలు బదిలీ చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు.

- Advertisement -

 దేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకాలను రాజకీయాలకతీతంగా లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా నేరుగా నగదు బదిలీ ద్వారా అందించిన ఏకైక ముఖ్యమంత్రి మన వైయస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి రాధా ప్రియదర్శిని, ఎంపీపీ అమరేష్, తాసిల్దార్ రమేష్ రెడ్డి, ఎంపీడీవో జగన్మోహన్ రెడ్డి, ఏవో శేషాద్రి,  మండల నాయకులు కృష్ణంరాజు, ప్రహ్లాద దేసాయి ఆచారి, ఉరుకుంద ఈరన్న స్వామి ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ నాగరాజు గౌడ్, వీరసేనా రెడ్డి, రామన్న గౌడ్, మరే గౌడ, వెంకటరామి రెడ్డి, గుర్నాథ్ రెడ్డి, సర్పంచ్ పాల్ దినకరన్, ఎంపిటిసి రాజ్ అహ్మద్, లింగన్న గౌడ్  పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News