Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Kodali: బాబు రాజకీయాలకు ఎన్టీఆర్‌ శత జయంతి

Kodali: బాబు రాజకీయాలకు ఎన్టీఆర్‌ శత జయంతి

టీడీపీ మహానాడుపై, అందులో భాగంగా చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టోపై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ప్రముఖుల చేత తనను పొగిడించుకోవడం కోసమే దివంగత ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకల్ని నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లిలో సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎన్టీఆర్ 100వ జయంతిని టీడీపీ ఘనంగా చేపట్టలేదు అని విమర్శించారు. ఏటా మహానాడు జరగటానికి భిన్నంగా ఏం చేశారు? అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ శత జయంతి పేరుతో చంద్రబాబుకు భజన చేయడానికి పక్క రాష్ట్రాల నుంచి హీరోలను తెచ్చుకున్నారని మండిపడ్డారు. అసలు చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ ఎన్టీఆర్ వారసులా? అని ప్రశ్నించారు కొడాలి.. మహానాడు వేదికపై నందమూరి బాలకృష్ణ ఫొటో ఎందుకు పెట్టలేదు? అని ప్రశ్నించారు. బాలయ్యను అమాయకుడిని చేసి వెనక తిప్పించుకుంటున్నారు అని నాని ఫైర్‌ అయ్యారు.

- Advertisement -

2014 లో ఇచ్చిన హామీల్లో ఎన్ని పూర్తి చేశారు
లోకేష్ పాదయాత్రకు వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న నందమూరి తారకరత్న ఫొటో ఎందుకు పెట్టలేదు? ఎన్టీఆర్ రక్తం పంచుకుని పుట్టినవారి ఫొటోలు కూడా ఉండవా? అని ప్రశ్నించారు. 2004, 2009లో వైఎస్సార్ ఇచ్చిన వాగ్దానాల్లో పూర్తి చేయలేదని ఒకటైనా చూపిస్తే దేనికైనా సిద్ధమే అని నాని సవాల్ విసిరారు. 2014లో 450 వాగ్దానాలు ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి రాగానే అన్నీ గాలికి వదిలేశాడని విమర్శించారు. డ్వాక్రా, రైతుల రుణాలు మాఫీ అన్నాడు.. చేశాడా? అని ప్రశ్నించారు. 2014లో రెండు వేల నిరుద్యోగ భృతి అన్నాడు.. అది కూడా గాలికి వదిలేశాడన్నారు. 2019 ఫిబ్రవరిలో కొంత మందికి ఇచ్చాడు? పెన్షన్ పెంచుతాని 2019 వరకు పట్టించుకోలేదన్నారు. చంద్రబాబు 30 లక్షల మందికి పెన్షన్ ఇస్తే.. జగన్ 60 లక్షల మందికి ఇస్తున్నారు అని పేర్కొన్నారు. విద్యార్థులకు ల్యాప్ టాప్ లు ఇస్తాను అన్నాడు.. ఒక్క విద్యార్ధికి అయినా ల్యాప్ టాప్ అయినా ఇచ్చాడా? అని విమర్శించారు. ఇన్నాళ్ళు ఏం చేయకుండా ఇప్పుడు ఏదో చేస్తాను అంటున్నాడంటూ మండిపడ్డారు. ఇదేనా మహానాడు అంటే అని నాని తెదేపా నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

చంద్రబాబుకు బీసీలంటే వీళ్లే
ఎన్టీఆర్‌ శత జయంతి పేరుతో బయటి వ్యక్తులను పిలుపించుకుని చంద్రబాబు తనకు డబ్బా కొట్టించుకుంటున్నారన్నారు. కనీసం ఎన్టీఆర్‌ శత జయంతి అన్నప్పుడు ఆయన చేసిన మంచి పనులను స్మరించుకునే సమయం కూడా తెదేపా నేతలకు లేకుండా పోయిందని మండిపడ్డారు. “బీసీలు మా వెన్నుముక అని చంద్రబాబు అంటున్నాడు. కానీ, ఆయన వెనుక పవన్ కళ్యాణ్, రామోజీ రావును పెట్టుకుంటాడు.. వీళ్ళు బీసీలా?” అని ప్రశ్నించారు. రాజశేఖరరెడ్డి, జగన్ కలిసి 55 లక్షల ఇళ్ళు కట్టారు.. వీటిలో 40 లక్షల ఇళ్ళు బీసీలకే ఇచ్చామన్నారు. ఈ రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అగ్రకుల పేదలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న వ్యక్తి జగన్ అని స్పష్టం చేశారు. చంద్రబాబు కేబినెట్‌లో 15 మంది ఓసీలు ఉంటే.. జగన్‌ కేబినెట్‌లో 17 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే ఉన్నారని తెలిపారు. ఒక్క బీసీని అయినా రాజ్యసభకు పంపించాడా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు వెన్నుముకగా నిలిచింది ఎన్టీఆర్‌ అని వెల్లడించారు. వేరే పార్టీల మ్యానిఫెస్టోలు కాపీ కొట్టి ఇది టీడీపీ మేనిఫెస్టో అంటున్నాడు అంటూ నాని విరుచుకుపడ్డారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News