Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Kotla Sujathamma: టీడీపీతోనే భవిష్యత్

Kotla Sujathamma: టీడీపీతోనే భవిష్యత్

మహాశక్తి చైతన్య రథం ప్రారంభించిన సుజాత

టీడీపీతోనే భవిష్యత్తుకు భరోసా అని ఆలూరు టీడీపీ ఇంచార్జ్ కోట్ల సుజాతమ్మ పేర్కొన్నారు. ఆమె మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీతో పాటు గద్దెరాళ్ల గ్రామంలో టీడీపీ మండల కన్వీనర్ విజయభాస్కర్ గౌడ్ ఆధ్వర్యంలో పర్యటించారు. ఈ సందర్భంగా “మహాశక్తి చైతన్య రథం” ఆవిష్కరించారు. ఈ అసమర్ధ వైసీపీ ప్రభుత్వాన్ని తరిమికొట్టాలి అని ప్రజలకు పిలుపునిచ్చారు. అంతకుముందు మండల కేంద్రంలో శ్రీలక్ష్మిరంగా కల్యాణ మంటపంలో తాలూకా స్థాయిలో ఆర్.టి.ఎస్ (రియల్ టైమ్ స్టాటజీ)క్లస్టర్,యూనిట్ ఇంచార్జిలు,బూత్ కన్వీనర్లు,బూత్ ఇంచార్జిల, సమావేశం నిర్వహించి అవగాహన కల్పించారు.
ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బి.టి నాయుడు ఆలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పరిశీలకులు ఆదినారాయణ,ట్రైనర్ లు ఉరుకుందు, వెంకన్న రామాంజనేయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హొళగుంద, ఆలూరు, చిప్పగిరి,
హాలహర్వి, ఆస్పరి, దేవనకొండ మండలాలకు చెందిన మండల కన్వీనర్లు, క్లస్టర్, యూనిట్ ఇంచార్జిలు, బూత్ కన్వీనర్లు, బూత్ ఇంచార్జిలు, సర్పంచ్ లు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, తెలుగు యువత నాయకులు, నందమూరి అభిమానులు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News