Thursday, September 19, 2024
Homeఆంధ్రప్రదేశ్Kovelakuntla: ఆర్టీసీ బస్టాండ్ ప్రారంభం

Kovelakuntla: ఆర్టీసీ బస్టాండ్ ప్రారంభం

కోవెలకుంట్ల పట్టణంలో 61 లక్షల రూపాయలతో నూతనంగా ఆధునికరించిన ఆర్టీసీ బస్ స్టాండ్ ను బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ,ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ఛైర్మన్ అబ్బిరెడ్డి మల్లికార్జున రెడ్డి, ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమల రావు ప్రారంబించారు. అనంతరం ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తన ఖర్చుతో ఏర్పాటు చేసిన ఉచిత మినరల్ చల్లని వాటర్ ప్లాంట్ ను ప్రారంబించారు. అనంతరం ఆర్టీసీ బస్ స్టాండ్ ను పరిశీలించి గ్యారేజ్ ను పరిశీలించి మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు . ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి, ఛైర్మన్ మల్లికార్జున రెడ్డి, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావులను సత్కరించారు. ఈ సందర్భంగా బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ 1986 లో ప్రారంభం అయిన ఆర్టీసీ బస్ స్టాండ్ పూర్తిగా శిధిలావస్థకు చేరుకొని వుండేదని తాను శాసన సభ్యునిగా ఎన్నికయిన తరువాత కరోనాతో ఆర్టీసీ భవనం పైపెచ్చులు ఊడిపడి ఒక వృద్దు కూడా చనిపోవడంతో వెంటనే తాను ఆర్టీసీ ఆధునికరణకు 61 లక్షల రూపాయలు మంజూరు చేయించి పూర్తిగా ఆధునీకరించినట్ణు వివరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News