Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Kurnool: ఏఎస్ఓలకు కంప్యూటర్లు పంపిణీ

Kurnool: ఏఎస్ఓలకు కంప్యూటర్లు పంపిణీ

క్షేత్రస్థాయిలో ప్రజలకు మెరుగైన సేవల కోసం..

కర్నూలు జిల్లాలోని 8 మండల సహాయ గణాంక అధికారులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన కంప్యూటర్లను పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో జిల్లాలోని 8 మండల కేంద్రాలలోని కర్నూలు ఉప గణాంక అధికారి, సహాయ గణాంక అధికారి, పెద్దకడబూరు, గూడూరు, నందవరం, కోసగి, దేవనకొండ, ఎమ్మిగనూరు, మండలాలలోని సహాయ గణాంక అధికారులకు ఈరోజు అధునాతన కంప్యూటర్లను పంపిణీ చేసినట్టు కలెక్టర్ అన్నారు. అధికారులు కార్యాలయాలకు వచ్చే ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక కమిషనర్ భార్గవ తేజ, ముఖ్య ప్రణాళిక అధికారి అప్పలకొండ, సిపిఓ కార్యాలయం సహాయ సంచాలకులు జి భారతి, కార్యాలయ సిబ్బంది ఎస్ వి రమణ, ఎస్ ఆదినారాయణ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News