Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Kurnool collectorate: పరిపాలన గణేశునికి ఘన వీడ్కోలు

Kurnool collectorate: పరిపాలన గణేశునికి ఘన వీడ్కోలు

కలెక్టరేట్ లో నిమజ్జన సందడి

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్ వినాయకుడి విగ్రహం గత తొమ్మిది రోజులుగా విశేష పూజలందుకున్న పరిపాలన గణేశునికి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన ఘన వీడ్కోలు పలికారు. కలెక్టరేట్ ఆవరణంలో ప్రతిష్టించిన పరిపాలన గణపతి విగ్రహానికి పూజలు చేసి జిల్లా కలెక్టర్ డా.జి.సృజన, జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, జిల్లా కలెక్టర్ తల్లితండ్రులు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గుమ్మళ్ళ బలరామయ్య , సుగుణ నిమజ్జనానికి పూజలు చేసి సాగనంపారు.

- Advertisement -

ఈ సందర్భంగా కలెక్టర్ ముందుగా కలెక్టరేట్ ఆవరణంలో ప్రతిష్టించిన పరిపాలన గణపతి విగ్రహానికి పూజలు నిర్వహించి, గత తొమ్మిది రోజులుగా విశేష పూజలందుకున్న గణేశునికి మంగళవారం ఘన వీడ్కోలు పలికారు. మొదటగా ఓల్డ్‌ సిటీలోని రాంబొట్ల దేవాలయం వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు కలెక్టర్ కుటుంబ కుటుంబ సభ్యులు అనంతరం వినాయక విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకుని వెళ్లారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ మధుసూదన రావు, కర్నూల్ ఆర్ డి ఓ హరి ప్రసాద్, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News