Saturday, November 15, 2025
Homeఆంధ్రప్రదేశ్Tirumala: తిరుమల మెట్ల మార్గంలో చిరుత కలకలం

Tirumala: తిరుమల మెట్ల మార్గంలో చిరుత కలకలం

తిరుమల (Tirumala) శ్రీవారి మెట్టు మార్గంలో మరోసారి చిరుత సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. ఇవాళ ఉదయం 500వ మెట్టు వద్ద పక్కనే ఉన్న చెట్ల పొదల్లో చిరుత కనిపించింది. అటుగా వెళ్తున్న భక్తులు గమనించి అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం అందజేశారు. అనంతరం అప్రమత్తమైన సిబ్బంది సైరన్‌ మోతతో చిరుతను అడవిలోకి తరిమేశారు. ఈ పరిణామంతో మెట్ల మార్గంలో వెళ్లే భక్తులు తీవ్ర భయాందళనకు గురవుతున్నారు. చిరుత కలకలంతో శ్రీవారి మెట్టు ప్రారంభంలో చెకింగ్ పాయింట్ వద్ద భక్తులను అధికారులు అనుమతించలేదు. చిరుతను అడవిలోకి తరిమిన తర్వాత భక్తులను గ్రూపుల వారీగా విభజించి మెట్ల మార్గంలోకి అనుమతించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad