Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Lokesh: జగన్ బెదిరిస్తే భయపడే బచ్చాలు ఎవరూ లేరు

Lokesh: జగన్ బెదిరిస్తే భయపడే బచ్చాలు ఎవరూ లేరు

జగన్ బెదిరిస్తే భయపడే బచ్చాలు ఎవరూ లేరు అని నంద్యాలలో జరిగిన నారా లోకేష్ యువగళం పాదయాత్ర సభలో అన్నారు. నందీశ్వరుడు తపస్సు చేసిన నేల నంద్యాల. నవనందులు కొలువైన పుణ్య భూమి ఇక్కడికి సమీపంలోనే మహానంది క్షేత్రం ఉందన్నారు. భూమా నాగిరెడ్డి ఇచ్చిన మాట ప్రకారం నంద్యాలని అభివృద్ధి చేశారు. ఎంతో గొప్ప చరిత్ర ఉన్న నంద్యాలలో పాదయాత్ర చెయ్యడం నా అదృష్టం అన్నారు. జగన్ మాతో పెట్టుకుంటే మటాష్ అయిపోతావ్ జాగ్రత్త. జగన్ ఈ మధ్య జబర్దస్త్ కామెడీ చేస్తున్నాడు. జగన్ పేదవాడు అంట, జగన్ ఒంటరి వాడు అంట. లక్ష కోట్ల ప్రజా ధనం కొట్టేసినవాడు పేదవాడా? లక్ష రూపాయల చెప్పులు వేసుకునే జగన్ పేదవాడా? వెయ్యి రూపాయల నీళ్ల బాటిల్ తాగే వాడు పేదవాడా? బెంగుళూరు యలహంకలో ప్యాలస్, హైదరాబాద్ లో ప్యాలస్, తాడేపల్లిలో ప్యాలస్, ఇడుపులపాయలో ప్యాలస్, విశాఖలో ప్యాలస్ కడుతున్నాడు. ఇన్ని ప్యాలస్ లు ఉన్నవాడు పేదవాడా. సిమెంట్ కంపెనీలు, పవర్ ప్లాంట్లు, సొంత పేపర్, ఛానల్ ఉన్నవాడు పేదవాడు ఎలా అవుతాడు. జగన్ దేశంలోనే ధనిక సీఎం, రాష్ట్రం మాత్రం అప్పుల్లో నంబర్1. ఒంటరి అన్న మాట నిజమే ఎందుకో తెలుసా. జగన్ క్రిమినల్ మైండ్ గురించి తెలుసుకున్న తల్లి, చెల్లి దూరం అయ్యారు. అందుకే జగన్ ఒంటరి అయ్యాడు. చంద్రబాబుది రామ రాజ్యం… జగన్ ది జంగిల్ రాజ్. చంద్రబాబు అంబేద్కర్ చట్టాలు.. జగన్ వి బ్రిటిష్ చట్టాలు. టిడిపి కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధించారు. ఎవ్వరినీ వదలం వడ్డీతో సహా చెల్లిస్తాం రాసిపెట్టుకోండి అంటూ లోకేష్ ప్రసంగం సాగింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News