Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Maddikera YCP: యువగళంలో యువకులకిచ్చిన హామీలు ఏమయ్యాయి?

Maddikera YCP: యువగళంలో యువకులకిచ్చిన హామీలు ఏమయ్యాయి?

రాష్ట్రంలో యువగళం పేరుతో పాదయాత్ర చేపట్టిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వంపై అసత్యపు ఆరోపణ చేస్తూ స్థానిక ఎమ్మెల్యేల కించపరుస్తూ ముందుకు సాగుతున్నారని, యువగళంలో యువకులకు ఎటువంటి హామీలూ ఇవ్వకుండా రాష్ట్ర ప్రజలను తప్పదో పట్టిస్తున్నారని మద్దికేర జడ్పిటిసి సభ్యులు మురళీధర్ రెడ్డి మాజీ మండల పరిషత్ అధ్యక్షులు మల్లికార్జున యాదవ్ పత్తికొండ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ భద్రయ్యలు అన్నారు.

- Advertisement -

స్థానిక వైసీపీ కార్యాలయంలో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ..నారా లోకేష్ శని, ఆదివారాల్లో పత్తికొండ నియోజకవర్గంలోని శభాష్ పురం రాంపల్లితో పాటు వివిధ గ్రామాల్లో పాదయాత్ర చేశారని అయితే తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలకు ఏమి చేస్తామని చెప్పకపోగా, అధికార పార్టీపై అసత్యపారోపణలు చేస్తున్నారని వారు ఆరోపించారు. అభివృద్ధి ఎక్కడ అని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం, పత్తికొండ శాసనసభ్యురాలు కంగాటి శ్రీదేవిని సైతం ఇష్టానుసారంగా మాట్లాడడం, ఒక మహిళా శాసనసభ్యురాలిని కించపరిచే విధంగా బహిరంగ సభలో మాట్లాడడం సబబు కాదన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సంఘం నాయకులు గంపల వెంకటేశ్వర్లు మాజీ సర్పంచ్ లు లక్ష్మన్న ప్రతాప్ బీసీ సెల్ నాయకులు కృష్ణ ముష్టి రామాంజనేయులు పంచాయతీ సలహాదారుడు బండారు ఆంజనేయులు సోమశేఖర్ ఎంపీటీసీ రామకృష్ణ (చిట్టి) మాజీ ఉప సర్పంచ్ వెంకటరామిరెడ్డి బురుజుల శేఖర్ ఆర్కే రామకృష్ణ చౌడప్ప యదవలి మధుసూదన్ రెడ్డి అశోక్ తో పాటు పలువురున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News