Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Mahanandi: 'తెలుగుప్రభ' కథనానికి స్పందించిన ఈవో చంద్రశేఖర్ రెడ్డి

Mahanandi: ‘తెలుగుప్రభ’ కథనానికి స్పందించిన ఈవో చంద్రశేఖర్ రెడ్డి

భక్తుల మనోభావాలను గౌరవిస్తాం

మహానందిలో కళ తప్పిన కోనేరు, నైపుణ్యానికి త్రిలోదకాలు ఇచ్చిన దేవాదాయ శాఖ సాంకేతిక సిబ్బంది అనే శీర్షికన గురువారం తెలుగుప్రభ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి మహానంది దేవస్థానం ఈవో చంద్రశేఖర్ రెడ్డి స్పందించారు. శుక్రవారం మహానంది దేవస్థానంలో మర్మతులు చేపట్టిన చిన్న కోనేరును పరిశీలించి ఏఈకి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఈవో చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ త్వరలో నియోజకవర్గ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డితో చర్చించి, కోనేరును పునర్వైభవం తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

- Advertisement -

సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు, పురావస్తు శాఖ అధికారులతో చర్చించి కోనేరును హైటు పెంచుతామని, నిర్మాణాల్లో నాణ్యత లోపించకుండా, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News