Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Mallapur: శివ స్వాములకు అన్నదానం చేసిన ముస్లిం కుటుంబం

Mallapur: శివ స్వాములకు అన్నదానం చేసిన ముస్లిం కుటుంబం

మండల కేంద్రంలో ప్రసిద్ధిగాంచిన కనక సోమేశ్వర కొండ కింద మండల దీక్ష తీసుకున్న శివ స్వాములకు ముస్లిం కుటుంబం అన్నదానం నిర్వహించింది. సిరిపుర్ గ్రామంలో ఏఎన్ఎం గా విధులు నిర్వహిస్తున్న రభియా సుల్తానా స్వాములకు అన్నదానం చేశారు. కరీంనగర్ ముస్లిం కుటుంబానికి చెందిన రబియ సుల్తానా, భర్త సలీం, కూతురు సమీరాలు స్వాములకు అన్న ప్రసాదం అందజేశారు. గత కొన్ని సంవత్సరాలుగా మహాశివరాత్రి పురస్కరించుకొని శివ దీక్ష పరులకు అన్నదానం చేపడుతున్నట్లు తెలిపారు. వేములవాడలో విధులు నిర్వహిస్తుండగా మహాశివరాత్రి రోజున కూతురు సమీరా జన్మించిందని తెలిపారు. కుల మతాలకు అతీతంగా శివదీక్షాధారులకు అన్నదానం నిర్వహించిన రబియా సుల్తానాను పలువురు అభినందిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News