Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Manakonduru: పిండం పెట్టి నిరసన తెలిపిన కాంగ్రెస్ నాయకులు

Manakonduru: పిండం పెట్టి నిరసన తెలిపిన కాంగ్రెస్ నాయకులు

కాంగ్రెస్ ఆధ్వర్యంలో వినూత్న నిరసన

రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల్లో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోని కెసిఆర్ ప్రభుత్వానికి నిరసనగా కెసిఆర్, కెటిఆర్ లకు పిండ ప్రధానం చేసిన కాంగ్రెస్ నాయకులు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పొలంపల్లి గ్రామంలో కొట్టుకు పోయిన లెవల్ బ్రిడ్జి వద్ద కాంగ్రెస్ నాయకులతో కలిసి పిండ ప్రదానం చేసిన కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డా.కవ్వంపల్లి సత్యనారాయణ. ఈ సందర్బంగా కవ్వంపల్లి సత్యనారా యణ మాట్లాడుతూ… ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల అనేక గ్రామాల్లో రోడ్లు, లో లెవల్ బ్రిడ్జ్లు కొట్టుక పోయిన, చెరువులు తెగిపోయిన పంట పొలాల్లో ఇసుక మేటలు వేసి రైతులు నష్టపోయిన ఇప్పటి వరకు స్థానిక ఎమ్మెల్యే కానీ అధికారులు కానీ కనీసం క్షేత్రస్థాయి పరిశీలన చేయలేదని, గత పదేళ్ళుగా అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సమ స్యలను పట్టించుకోలేదు. వర్షాల వల్ల నియోజకవర్గంలో అనేక గ్రామాలకు రాకపోకలు నిల్చిపోయా యని సరైన రోడ్డు మార్గాలు బ్రిడ్జిలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, పొలంపల్లి, మొగిలి పాలెం గ్రామాల బ్రిడ్జి మంజూరు ఐన టెండర్లు కాక పనులు చేయడం లేదని అధికారులు తెలిపారు. ప్రజా సమస్యలు పట్టించుకొని ఎమ్మెల్యేకు రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ది చెబుతారని హెచ్చరించారు.

- Advertisement -


ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మోరపల్లి రమణా రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ఎల్కపల్లి సంపత్, పోలంపల్లి ఎంపీటీసీ బండారి రమేష్, పోలంపల్లి మాజీ సర్పంచ్ బుడిగే కొండయ్య, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు చేన్నబోయిన రవి, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు రెడ్డి గాని రాజు, గ్రామశాఖ అధ్యక్షులు గుంటి మల్లేష్, కాంగ్రెస్ నాయకులు కనకం కొమురయ్య, మహ్మద్ ఆశిక్ పాషా, బుడిగే సంపత్, గుంటి బిరయ్య, పడల శ్రీనివాస్, అనిల్, హరీష్, షబ్బీర్, యాకుబ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News