Monday, June 24, 2024
Homeఆంధ్రప్రదేశ్Mantralayam: సువర్ణ సింహాసనంపై రాఘవేంద్రుల పాదుకలకు పూజలు

Mantralayam: సువర్ణ సింహాసనంపై రాఘవేంద్రుల పాదుకలకు పూజలు

శ్రీరాఘవేంద్రుల పాదుకలకు మంత్రాలయం పీఠాధిపతి శ్రీసుబుధేంద్ర తీర్థులు పట్టాభిషేకం నిర్వహించారు. శ్రీరాఘవేంద్ర స్వామి పాదుకలను సువర్ణ సింహాసనంలో ఉంచి పుష్పార్చన, కనకాభిషేకం, రత్నాభిషేకం (ముత్యాలతో అభిషేకం) నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీవేంకట రమణి అటార్ని జనరల్ సుప్రీంకోర్టు ఇండియా, పండితకేసరి రాజా ఎస్. గిరియాచార్యులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. అనంతరం రాఘవరాయల పాదుకలను సువర్ణరథంలో ఉంచి ప్రాకారంలో ప్రాతఃకాల రథోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పీఠాధిపతులు నూతన సంవత్సర పంచాంగాన్ని ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈపవిత్ర ఘట్టాన్ని తిలకించి ఆశీస్సులు పొందారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News