HomeTop StoriesProject Punarvika: ఇకపై బోసినవ్వులు మూగబోవు.. 'ప్రాజెక్టు పునర్విక'ను ప్రకటించిన మంత్రి నారా లోకేశ్‌

Project Punarvika: ఇకపై బోసినవ్వులు మూగబోవు.. ‘ప్రాజెక్టు పునర్విక’ను ప్రకటించిన మంత్రి నారా లోకేశ్‌

Project Punarvika by Nara Lokesh: రాష్ట్రంలో ఇకపై అరుదైన జన్యువ్యాధులతో బాధపడే చిన్నారులను ఆదుకునేందుకు ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. తెలుగు రాష్ట్రాల నుంచి దాతల సహకారంతో పాటు ప్రభుత్వం చొరవతో పునర్విక మరో జన్మని అందుకున్న విషయం తెలిసిందే. ప్రాణాపాయం నుంచి బయటపడిన ఆ చిన్నారి బోసినవ్వులను చూసి భావోద్వేగానికి లోనైన మంత్రి నారా లోకేశ్‌.. అలాంటి తరహా వ్యాధులతో ఇకపై ఏ చిన్నారి జీవితం ముగియకూడదని కీలక నిర్ణయం తీసుకున్నారు. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/national-news/prakash-rajs-explanation-in-the-controversy-over-comments-on-lord-sri-ram/

అరుదైన జన్యు వ్యాధులతో బాధపడే పిల్లల కోసం ‘ప్రాజెక్ట్ పునర్విక’ అనే కొత్త పథకాన్ని మంత్రి నారా లోకేశ్‌ ప్రకటించారు. జన్యుపరమైన, అత్యంత ఖరీదైన చికిత్స అవసరమయ్యే అరుదైన వ్యాధులతో బాధపడే పిల్లలను ఈ పథకం ద్వారా ఆదుకుంటారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న పిల్లలకు ఖరీదైన వైద్యం అందేలా ప్రభుత్వమే బాధ్యత తీసుకునేలా ఈ పథకాన్ని రూపొందించారు. చిన్నారి పునర్వికకు జరిగిన వైద్య సహాయం విజయవంతం కావడంతో ఈ పథకానికి ఆమె పేరునే నామకరణం చేయడం విశేషం. 

Also Read: https://teluguprabha.net/top-stories/cm-revanth-reddy-emergency-meeting-with-governor-shiv-pratap-shukla/

కర్నూలు జిల్లాకు చెందిన చిన్నారి పునర్విక అనే పాప ‘స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ’ అనే అరుదైన జన్యు వ్యాధితో బాధపడుతుండగా, ఆమె చికిత్స కోసం రూ. 16 కోట్ల విలువైన ఇంజెక్షన్ అవసరమైంది. దీనిపై స్పందించిన మంత్రి లోకేశ్, ఆ పాపకు అవసరమైన సాయం అందిస్తానని మాట ఇచ్చారు. దీంతో సోషల్‌ మీడియా వేదికగా దాతల ద్వారా రూ. 10 కోట్లు సేకరించగా.. ప్రభుత్వం తరఫున రూ. 6 కోట్లు ఆర్థిక సహాయం అందించారు. ఫలితంగా శనివారం ఆ పాపకు ఇంజెక్షన్ ప్రక్రియ విజయవంతంగా పూర్తి అయింది. ఈ స్ఫూర్తితో రాష్ట్రవ్యాప్తంగా ఇటువంటి వ్యాధులతో బాధపడే ఇతర పిల్లలను ఆదుకోవడానికి ఈ ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టింది. 

పేద కుటుంబాల పిల్లలకు వైద్యం అందక ఇబ్బంది పడకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి లోకేశ్ తెలిపారు. అరుదైన వ్యాధుల బారిన పడిన ప్రతి బిడ్డను కాపాడుకోవడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యమని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News