Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్MLA Shilpa: కుటుంబాలన్నీ సంతోషంగా ఉండాలన్నదే మా లక్ష్యం

MLA Shilpa: కుటుంబాలన్నీ సంతోషంగా ఉండాలన్నదే మా లక్ష్యం

గడప గడపకులో ఎమ్మెల్యే

నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 30వార్డు ఎమ్మెస్ నగర్ లో 144వ రోజు వార్డ్ ఇంచార్జ్ రామచంద్రుడు వార్డు కౌన్సిలర్ లక్ష్మీదేవి ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి పాల్గొన్నారు. వార్డులో ప్రతి గడప తిరుగుతూ ..అక్కడి సమస్యలను, సంక్షేమ అభివృద్ధిపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంక్షేమ పథకం ఇంటి వద్దకే అందించడం ఎంతో సంతోషంగా ఉందని అలాగే పింఛన్ 1వ తేది ఉదయన్నే పింఛన్లు అందిస్తున్నందుకు జగనన్నకు ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు..ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిల్ప రవి రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి కేవలం శంకుస్థాపనలకే పరిమితమైందని వైఎస్ఆర్ ప్రభుత్వంలో మాట తప్పని మడమ తిప్పని నేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో పట్టణంలో అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు.

- Advertisement -

శంకుస్థాపన చేయడమే కాకుండా ప్రారంభోత్సవాలు కూడా తామే చేస్తుండం గర్వంగా ఉందని అన్నారు. పట్టణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిరాటంకంగా సాగుతున్నాయన్నారు. ప్రజా అవసరాలను తీర్చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో గుర్తించిన పలు సమస్యను పరిష్కరిస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఏపీఎస్పీడీసీఎల్ శశికళ రెడ్డి వార్డ్ వైసిపి నాయకులు కృష్ణారెడ్డి, రామకృష్ణ, తులసి, దివాకర్, రవి, శంకర్, లోకేష్, మధు, చౌటు, రాజేష్ ,మరియు మాజీ కౌన్సిలర్ లక్ష్మీనారాయణ, భాస్కర్ రెడ్డి, కిరణ్, దండే సుధాకర్, అధికారులు వార్డు వాలంటీర్లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News