Thursday, April 10, 2025
Homeఆంధ్రప్రదేశ్MLA Shilpa: వాలంటీర్లు నిజమైన ప్రజా సేవకులు

MLA Shilpa: వాలంటీర్లు నిజమైన ప్రజా సేవకులు

ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులు, నిజమైన ప్రజా సేవకులైన వాలంటీర్లకు వందనం

స్వచ్ఛందంగా ప్రజలకు సేవలందిస్తున్న ప్రతి వాలంటీర్కు వందనం తెలియజేస్తున్నామని ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్రెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డిలు తెలిపారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులుగా నిజమైన ప్రజా సేవకులుగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధిదారుల గడపలవద్దకు అందిస్తున్న ప్రతి వాలంటీర్ సేవలను ప్రభుత్వం మరచిపోదని, వారి సేవలను గుర్తిస్తూ, ప్రశంసిస్తూ సేవావజ, సేవారత్న, సేవా మిత్ర అవార్డులను, ప్రోత్సాహకాలను అందించి సన్మానించారు.

- Advertisement -

లంచాలు, వివక్షత లేకుండా పారదర్శకంగా సచివాలయ వ్యవస్థ ద్వారా, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ప్రభుత్వ పథకాన్ని అర్హులైన లబ్ధిదారులకు అందిస్తున్నారన్నారు. నంద్యాల మున్సిపల్ టౌన్ హాల్ నందు మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి ఆద్వర్యంలో పట్టణ పరిధిలో ఉత్తమ సేవలను అందించిన వాలంటీర్లకు సేవావజ్ర, సేవారత్న, సేవా మిత్ర అవార్డులను, ప్రోత్సాహకాలను అందించి ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పారవిచంద్రకిషోర్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నీసా, వైస్ చైర్మన్లు గంగిశెట్టి శ్రీధర్, పాంషావలి, దృశ్యకళల డైరెక్టర్ సునీత అమృతరాజ్, బెస్త సంఘం డైరెక్టర్ చంద్రశేఖర్ హాజరై వాలంటీర్లకు పురస్కారాలను అందజేసి ఘనంగా సన్మానించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News