Tuesday, September 17, 2024
Homeఆంధ్రప్రదేశ్Mantralayam: టికెట్ నాకే వస్తుంది: తిక్కారెడ్డి

Mantralayam: టికెట్ నాకే వస్తుంది: తిక్కారెడ్డి

వైసిపి కోవర్ట్ రాఘవేంద్ర రెడ్డి కోసం పనిచేయం

మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ టికెట్ పునారాలోచన చేసి .. కచ్చితంగా నాకే ఇస్తుంది మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ బాధ్యులు పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. కార్యకర్తలు నాయకులు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలన్నారు. మంత్రాలయం తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో కోసిగి మండలం జంపాపురం, చిన్న భూంపల్లి, దోడ్డి బెళగల్, పెద్దకడబూరు మండలం చిన్నతుంభళం, బసలదొడ్డి, పులికనుమ గ్రామాల నాయకులు కార్యకర్తలు తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల నాయకులు కార్యకర్తలు మాట్లాడుతూ… రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ టికెట్ పునారాలోచన చేసి పాలకుర్తి తిక్కారెడ్డి గారు కి ఇవ్వాలని మంత్రాలయం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేస్తామన్నారు . ఇప్పుడు ప్రకటించిన వ్యక్తి వైసిపి కోవర్ట్ రాఘవేంద్ర రెడ్డి గెలుపు కోసం మేం పనిచేయమన్నారు. మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ టికెట్ పాలకుర్తి తిక్కారెడ్డికే ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి, మంత్రాలయం మండలం కన్వీనర్ పన్నాగా వెంకటేశప్ప స్వామి, సీనియర్ నాయకులు వక్రాని వెంకటేశ్వర్లు, నాడిగేని అయ్యన్న, బిసి సెల్ నియోజకవర్గం అధ్యక్షులు మాధవరం అమర్నాథ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, తెలుగు యువత జిల్లా మీడియా కోఆర్డినేటర్ విజయ రామిరెడ్డి,తెలుగు యువత మండల అధ్యక్షులు నాడిగేని మహాదేవ, చిన్న భూంపల్లి మాజీ సర్పంచ్ నరసింహులు, జంపాపురం మాజీ సర్పంచ్ క్రిష్ణా రెడ్డి, చిన్నతుంభళం వీరేష్ ధని, సిద్ధప్ప ధని, సర్పంచ్ శివ, చంద్ర, బెళగల్ సర్పంచ్ రామయ్య, గుండేష్, రంగారెడ్డి, గోపాల్, శ్యామ్, నర్సారెడ్డి, శీను, బాలస్వామి, పేతురు, యోహాను, నాగేష్, పులికనుమ నల్లారెడ్డి, బసలదొడ్డి అయ్యప్ప, అంజినయ్య, వీరారెడ్డి ,క్రిష్ణ,రజాప్, ఖాదర్ బాషా, యోహాను, చిన్న భూంపల్లి నీలకంఠ, ఉసేని,భీమురాయుడు, జంపాపురం నరసింహారెడ్డి, నాగేంద్ర, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News