Monday, March 10, 2025
Homeఆంధ్రప్రదేశ్Paper Leak: ఏపీలో ప్రశ్నాపత్రం లీక్ కలకలం

Paper Leak: ఏపీలో ప్రశ్నాపత్రం లీక్ కలకలం

ఏపీలో ప్రశ్నాపత్రం లీక్(Paper Leak) కావడం కలకలం రేపుతోంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(Nagarjuna University) పరిధిలో బీఎడ్ మొదటి సెమిస్టర్ ప్రశ్నాపత్రం లీక్ అయింది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ప్రాస్పెక్టివ్స్ ఇన్ చైల్డ్ డెవలప్మెంట్ పరీక్ష జరగాల్సి ఉంది. అయితే పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే పేపర్ లీక్ అయింది.

- Advertisement -

దీనిపై యూనివర్సిటీ పీజీ పరీక్షల కోఆర్డినేటర్ ప్రొఫెసర్ సుబ్బారావు స్పందిస్తూ పరీక్ష ప్రారంభానికి 30 నిమిషాల ముందు సీడీ ద్వారా పేపర్ రిలీజ్ చేశారని తెలిపారు. అయితే అది బయటికి ఎలా లీకైందో తెలియదని వెల్లడించారు. కాగా గురువారం జరిగిన పరీక్ష పేపర్ కూడా అరగంట ముందే లీక్ అయినట్లు తెలుస్తోంది. గుంటూరు జిల్లాలోని ఓ ప్రాంతానికి చెందిన కాలేజీ యాజమాన్యం ఈ ప్రశ్నాపత్రం లీక్ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News