Tuesday, June 17, 2025
Homeఆంధ్రప్రదేశ్Nandavaram: సర్వేలు, ఓటరు తొలగింపు చేస్తున్నారని మండిపడ్డ దేశాయ్

Nandavaram: సర్వేలు, ఓటరు తొలగింపు చేస్తున్నారని మండిపడ్డ దేశాయ్

చంద్రబాబు జైల్లో ఉండగా సర్కారు చేస్తున్న పనులివంటూ మండిపడ్డ దేశాయ్

వైసీపీ పట్ల టీడీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని మార్కెట్ యార్డు మాజీ చైర్మన్, నియోజకవర్గ క్లస్టర్ ఇంచార్జి, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు మాధవరావు దేశాయ్ అన్నారు. మండల కేంద్రమైన నందవరంలో ఓ సంస్థ పేరుతో గ్రామంలో ఇంటింటికి వెళ్ళి వివరాలు సేకరించారు. వారిని దేశాయ్ అడ్డుకొని స్థానిక అధికారులకు సమాచారం ఇస్తే అలాంటి సర్వే లేదని వారు తెలిపారు. ఈ సందర్భంగా దేశాయ్ మాట్లాడుతూ ఇలాంటి గుంటనక్క పనులు చేసే వైసీపీ పట్ల అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరారు. అధినేత నారా చంద్రబాబు నాయుడుని అక్రమంగా అరెస్టు చేసి, జైల్లో ఉంచి .. వారు లేని సమయంలో సర్వేలు, ఓటరు తొలగింపు చేసేందుకు వైసీపీ సన్నాహాలు చేస్తుందని కావున పార్టీ నాయకులు,కార్యకర్తలు చంద్రబాబు అక్రమ అరెస్టు పై పోరాటం చేస్తూనే దొంగ సర్వేల పట్లా అప్రమత్తంగా ఉండాలన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News