Thursday, September 19, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandavaram: 'యువగళం'తో వైసిపిలో వణుకు: క్లస్టర్ ఇంచార్జ్ ఖాశిం వలి

Nandavaram: ‘యువగళం’తో వైసిపిలో వణుకు: క్లస్టర్ ఇంచార్జ్ ఖాశిం వలి

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రివర్యులు నారా లోకేష్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర వైసిపి శ్రేణుల వెన్నులో వణుకు పుట్టిస్తుందని నందవరం మండల క్లస్టర్ ఇంచార్జ్ ఎస్ ఖాశిం వలి అన్నారు. ఈ సందర్భంగా ఆయన యువగళం పాదయాత్ర సోమవారంతో వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎమ్మిగనూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బి వి జయ నాగేశ్వర్ రెడ్డి ఆదేశాల మండల లోని ఆయా గ్రామాల నుంచి పార్టీ నాయకుల తో ఎమ్మిగనూరుకు బయలుదేరారు. నియోజకవర్గం టిడిపి నేతలు, కార్యకర్తలు, తెలుగు మహిళలు, తెలుగు యువత, నందమూరి వంశ వీరాభిమానులు, టీఎన్ఎస్ఎఫ్ సభ్యులు, ఐ టి డి పి సభ్యులతో కలిసి మాజీ ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్రెడ్డి ఎమ్మిగనూరు పట్టణంలోని స్థానిక శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం నుండి బాట మారెమ్మ దేవాలయం వరకు నారా లోకేష్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ పాదయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో బివి జయ నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ నారా లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్రకు వస్తున్న ప్రజాదరణ చూసి వైసీపీలో వణుకు పుట్టిందని తెలిపారు. రానున్నది చంద్రన్న రాజ్యమని ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో కష్టపడి పని చేయాలని నియోజకవర్గంలోని నాయకులను, కార్యకర్తలను కోరారు. వైసీపీ చేస్తున్న అరాచకాలపై ప్రజలు విసుగు చెందారని వైసీపీని ప్రజలే తరిమికొడతారని తెలిపారు. కార్యకర్తలకు తమ కుటుంబం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎవరు అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, మాచపురం క్లస్టరీ ఇంచార్జ్ ఖాశిం వలి, పూలచింత బండేగురు స్వామి, చిన్న రాముడు, నాగరాజ్ గౌడ్, గడ్డం నారాయణ, భార్గవ్, బాలరాజ్, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News