Thursday, September 19, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandavaram: పాఠశాల యాజమాన్య కమిటీల ఎన్నిక ఏకగ్రీవం

Nandavaram: పాఠశాల యాజమాన్య కమిటీల ఎన్నిక ఏకగ్రీవం

మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన పాఠశాల యాజమాన్యం కమిటీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆయా పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఆధ్వర్యంలో విద్యార్థిని, విద్యార్థుల తల్లిదండ్రులు ఆయా పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ లను కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

- Advertisement -

ఎన్నికల అనంతరం ఆయా పాఠశాలల నూతనంగా ఎన్నికైన కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్లు మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు మాపై నమ్మకం ఉంచి మాకు ఇచ్చిన ఈ బాధ్యతను శిరసా వహించి పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తామని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News