Tuesday, September 17, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandikotkuru: ఇంటర్ లో 978 మార్కులతో సిరిగిరి ఆశ్రిత ఉత్తమ ప్రతిభ

Nandikotkuru: ఇంటర్ లో 978 మార్కులతో సిరిగిరి ఆశ్రిత ఉత్తమ ప్రతిభ

నందికొట్కూరు పట్టణం ఏబీఎన్ పాలెం చెందిన సిరిగిరి ఆశ్రిత అనే విద్యార్థి ఇంటర్ సెకండియర్ ఫలితాలలో బైపిసి గ్రూపులో 978 మార్కులతో ఉత్తమ ప్రతిభ కనబరిచింది. పట్టణంలోనే శ్రీ నంది జూనియర్ కళాశాలలో విద్యను అభ్యసించిన సిరిగిరి అశ్రిత పట్టణంలోని ఎబియం పాలెంకు చెందిన సిరిగిరి జయన్న, ప్రభావతి దంపతుల కుమార్తె . ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్మీడియట్ పరిక్ష ఫలితాలలో బైపిసి గ్రూపులో 1000 మార్కులను 978 మార్కులతో ఉత్తమ ప్రతిభ కనబరచడంతో పలువురు ప్రశంసించారు. తల్లిదండ్రులు ప్రోత్సాహంతో ఉపాధ్యాయులు నేర్పిన విద్యతో చదువులో ఏమాత్రం వెనకడుగు వేయకుండా ముందుకు సాగి వారి సలహాలు సూచనలతో ఉత్తమ మార్కులు సాధించడం సాధ్యమైందని సిరిగిరి అశ్రిత తెలిపారు. పట్టుదలతో శ్రమిస్తే ఏమైనా సాధ్యమని, విద్యార్థిని విద్యార్థులకు మరి ముఖ్యంగా ఆడపిల్లలు చదువులో రాణించాలి అంటే తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో అవసరమని , అనుక్షణం తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఉత్తమ మార్పులు సాధించడానికి కారణమైందని పేర్కొన్నారు. బైపిసి గ్రూపు నందు ఉత్తమ మార్కులతో ప్రతిభ కనబరిచిన సిరిగిరి అశ్రితకు ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు అభినందనలు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News