Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandikotkuru: సమస్యలు నేరుగా సీఎంకి చెప్పేందుకే 'జగనన్నకు చెబుదాం'

Nandikotkuru: సమస్యలు నేరుగా సీఎంకి చెప్పేందుకే ‘జగనన్నకు చెబుదాం’

ప్రజల సమస్యలను పరిష్కరించి మెరుగైన ప్రభుత్వ సేవలు అందించేందుకే ‘జగనన్నకు చెబుతాం’ అనే కార్యక్రమాన్ని సీఎం జగనన్న ప్రారంభించారని ఎమ్మెల్యే తోగూర్ అర్థర్ అన్నారు. పట్టణంలోని స్థానిక మండల అభివృద్ధి కార్యాలయంలో జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి ఎమ్మెల్యే తోగూర్ అర్థర్ హాజరయ్యారు. సందర్భంగా ఎమ్మెల్యే అర్థర్ తోపాటుగా మండలాధ్యక్షుడు మురళి కృష్ణారెడ్డి, తహసిల్దార్ రాజశేఖర్ బాబు, అర్బన్ సిఐ విజయ భాస్కర్, ఎంపీడీవో శోభారాణి, కౌన్సిలర్ జాకీర్ హుస్సేన్, సింగిల్ విండో చైర్మన్ సగినేలా హుస్సేనయ్య లు సీఎం జగన్ లైవ్ కె లిప్ కాస్ట్ “జగనన్న కు చెబుదాం” ప్రోగ్రాంను వీక్షించారు.
అనంతరం ఎమ్మెల్యే తోగూర్ అర్థర్ మాట్లాడుతూ సీఎం జగనన్న నాలుగు సంవత్సరాల పాలన కాలంలో ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తూ వారి సమస్యల పరిష్కారానికి గడపగడపకు మన ప్రభుత్వం, మరియు జగనన్నే మా నమ్మకం అనే కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం చేపట్టలేని సంక్షేమ పథకాలు చేపట్టి, ప్రజల వద్దకు నిరంతరం ప్రజా ప్రతినిధులు వెళ్లేలా కార్యక్రమాలు పెట్టి ప్రజల సమస్యలను పరిష్కరించిన ప్రజా నాయకుడు సీఎం జగన్ మాత్రమేనని కొనియాడారు. మరింతగా ప్రజలకు మెరుగైన ప్రభుత్వ సేవలు అందించేందుకు ప్రజలు నేరుగా పరిష్కారం కానీ తమ సమస్యలను సీఎం జగనన్న దృష్టికి తీసుకెళ్లేందుకు 1902 టోల్ ఫ్రీ నంబర్ పెట్టి వాటి పరిష్కారానికి అధికారులు కృషిచేసేలా
నిరంతరం శ్రమిస్తున్న ప్రజల పక్షపాతి సీఎం జగన్ అని అన్నారు. కార్యక్రమంలోకౌన్సిలర్ ఉండవల్లి ధర్మ రెడ్డి,పశుసంవర్ధక శాఖ జెడి వరప్రసాద్, మండల పరిధిలోని ఎంపీటీసీలు, సర్పంచులు, వైసీపీ ఎస్సీ సెల్ విభాగం జిల్లా అధ్యక్షులు వెంకటరమణ, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ దిలీప్ రాజ్, వైఎస్ఆర్సిపి నాయకులు పంబాటి రవి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News